History of Rajanala Banda Temple : మన రాష్ట్రం ఆధ్యాత్మికతకు నిలయం. ఇక్కడ పురాతన చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ఔరా అనే అనేక కళాకృతులు గల ఆలయాలు నేటికీ అనేకం ఉన్నాయి. కొన్ని చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అమూల్యమైన దేవాలయాలు మనకు తరగని సంపద. ముఖ్యంగా కొన్ని ఆలయాల్లో దేవుడి మహిమల గురించి కొకొల్లలుగా ప్రచారాలు ఉన్నాయి. అలాంటి ఓ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Rajanala Banda Utsavalu 2024 :దొంగతనాలు, వివాదాలు, గొడవలు జరిగితే ఎవరైనా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు. లేదంటే పెద్ద మనుషుల దగ్గర పంచాయితీ పెట్టి ఆ ఆ సమస్యను పరిష్కరించుకుంటారు. కానీ అక్కడి వారు మాత్రం రాజనాల బండకు తొక్కితే అది పరిష్కారమవుతాయని నమ్మిక. అంతటి మహిమ గల బండ చిత్తురు జిల్లాలో ఉంది. ఈ ఆలయం చౌడేపల్లె మండలం వెంగళపల్లె పంచాయతీ పరిధిలోని దాసరయ్యగారిపల్లెకు సమీపంలో ఉంది. బండకు తూర్పున కొండపై లక్ష్మీనరసింహస్వామి, బండపై వీరాంజనేయస్వామి, ఆయనకు నైరుతిలో మహేశ్వరుడు లింగస్వరూపుడై నిలిచారు. ఈ క్షేత్రం శ్రీకృష్ణదేవరాయుల కాలంలో వెలిసినదని పురాణాలు చెబుతున్నాయి.
ప్రతి శనివారం ప్రమాణాలు :ఎవరైైనా వస్తువులు పోగొట్టుకున్న బాధితులు శనివారం ఆలయంలో పేరు నమోదు చేయించుకుంటారు. మరుసటి శనివారం అనుమానితులను ఈ గుడికి తీసుకొస్తారు. ఆలయ పూజారులు వారందరిని విచారించి ఇక్కడ ప్రమాణం చేస్తే జరిగే అనర్థాలను వివరిస్తారు. అనంతరం వాయిదా ఇస్తారు. వాయిదా కాలంలో బాధితుని ఇంటి ఆవరణలో ఎక్కడో ఒకచోట పోయిన నగదు, వస్తువులు లభించడం విశేషం.