ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పుష్ప 2' ప్రదర్శించడం లేదు' - ప్రసాద్‌ మల్టీప్లెక్స్ కీలక నిర్ణయం - NO SCREENS FOR PUSHPA 2 IN PRASADS

‘పుష్ప ది రూల్‌' సినిమాను తమ స్క్రీన్స్‌లో ప్రదర్శించడం లేదని తెలిపిన ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌ - ఈ మేరకు ఎక్స్​ వేదికగా ట్వీట్

no_screens_for_pushpa_2_in_prasads
no_screens_for_pushpa_2_in_prasads (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2024, 5:29 PM IST

PrasadsMultiplex stops screening Pushpa 2 The Rule Movie :సినీ ప్రముఖులు, హైదరాబాద్​ వాసులకు ఎంతో ఇష్టమైన సినిమా థియేటర్లలో ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌ ముందుంటుంది. ఇందులో సినిమాని చూసేందుకు, సినిమాటిక్​ అనుభూతిని పొందేందుకు ప్రతిఒక్కరూ ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కాంబినేషన్‌లో విడుదలైన ‘పుష్ప ది రూల్‌’ (Pushpa 2 The Rule)ను ఈ మల్టీప్లెక్స్​లో చూడాలని ఎదురుచూస్తున్న సినీ అభిమానులకు నిరాశ ఎదురైంది. ఈ సినిమాను తాము ప్రదర్శించడం లేదని ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌ వెల్లడించింది. ఈ మేరకు ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌ టీమ్‌ ఎక్స్​ వేదికగా వెల్లడించింది.

ప్రేక్షకుల ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి : సినీ అభిమానులకు అత్యుత్తమమైన సినిమాటిక్‌ అనుభూతిని అందించడమే లక్ష్యంగా సుమారు రెండు దశాబ్దాల నుంచి తాము పని​ చేస్తున్నామని ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌ టీమ్‌ తెలిపింది. దురదృష్టవశాత్తు కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌లో పుష్ప 2 సినిమాని ప్రదర్శించలేకపోతున్నామని వెల్లడించింది. సినీ ప్రేమికులకు నిరాశ కల్పించినందుకు తాము చింతిస్తున్నామని పేర్కొంది. తమను అర్థం చేసుకుంటారని అలానే ప్రేక్షకుల ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. అయితే సినిమాను ప్రదర్శించకపోవడం వెనక ఉన్న కారణాన్ని మాత్రం తెలపలేదు. ప్రస్తుతం ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌ టీమ్‌ చేసిన ట్వీట్ వైరల్​గా మారింది.

మూవీ మేకర్స్​తో ఆర్థిక విషయాల్లో బేధాభిప్రాయాలు :మరోవైపు ఐమ్యాక్స్ పక్కనే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు జరుగుతుండటం, పోలీసు బందోబస్తు ఉండటం ఒక కారణమని తెలుస్తుండగా పుష్ప చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్​తో (Mythri Movie Makers) ఆర్థిక విషయాల్లో బేధాభిప్రాయాలే కారణమని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రసాద్ ఐమ్యాక్స్ చరిత్రలో కరోనా కాలం మినహాయించి ఒక పెద్ద హీరో సినిమా ప్రదర్శనలు లేకపోవడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. పెద్ద హీరోల సినిమాల రిలీజ్ వల్ల రోజుకు 36 ఆటలతో సందడిగా ఉండే ప్రసాద్ ఐమ్యాక్స్ పరిసరాలు ప్రస్తుతం సందడి లేకుండా ఉన్నాయి.

సంధ్య థియేటర్​ తొక్కిసలాట ఘటన - దురదృష్టకరమన్న అల్లు అర్జున్ టీమ్

'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్​లో అల్లు అర్జున్ ఎమోషనల్ స్పీచ్ - ఫ్యాన్స్​ను ఉద్దేశించి బన్నీ ఏమన్నారంటే?

ABOUT THE AUTHOR

...view details