ETV Bharat / state

సంచలనంగా మారిన పారిశ్రామికవేత్త హత్య - వెలుగులోకి షాకింగ్ విషయాలు - VELJAN GROUP JANARDHANA RAO MURDER

తాతను 73 సార్లు కత్తితో పొడిచిన చంపిన మనవడు - కొన్ని రోజులుగా ఆస్తుల విషయంలో గొడవలు - నిందితుడు మాదకద్రవ్యాలకు బానిసయ్యాడని అనుమానిస్తున్న పోలీసులు

VELJAN GROUP JANARDHANA RAO MURDER
VELJAN GROUP JANARDHANA RAO MURDER (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2025, 5:52 PM IST

VELJAN GROUP JANARDHANA RAO MURDER: ఆస్తి తగాదాల నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్‌ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దనరావును తన మనవడు అత్యంత దారుణంగా హత్య చేశాడు. హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఈ ఘటన చోటుచేసుకోగా నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరు ప్రాంతానికి చెందిన జనార్దన్‌రావు కొన్ని సంవత్సరాలుగా సోమాజిగూడలో నివాసం ఉంటున్నారు. ఇటీవల తన పెద్ద కుమార్తె కుమారుడు శ్రీకృష్ణను వెల్జాన్‌ కంపెనీకి డైరెక్టరుగా నియమించారు. అదే విధంగా మరో కుమార్తె అయిన సరోజినీదేవి కుమారుడు కిలారు కీర్తితేజ(29) పేరు మీద రూ.4 కోట్ల షేర్లను బదిలీ చేశారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి సరోజినీదేవి తన కుమారుడు కీర్తితేజతో కలిసి తండ్రి ఇంటికి వెల్లారు. ఈ సమయంలో ఆస్తి పంపకాల విషయంలో తన తాతతో కీర్తితేజ వాగ్వాదానికి దిగాడు.

తండ్రికి టీ తెచ్చేందుకు సరోజినీదేవి ఇంట్లోకి వెళ్లగా ఇదే సమయంలో కీర్తితేజ తన వెంట తెచ్చుకున్న కత్తితో తాతను 73 సార్లు పొడిచాడు. కేకలు విన్న సరోజినీదేవి వెంటనే వచ్చి కుమారుడిని వారించబోయారు. ఆ సమయంలో సరోజినీదేవి మీద కూడా దాడిచేసి కత్తితో నాలుగు చోట్ల పొడిచాడు. అక్కడే ఉన్న కాపలాదారు వీరబాబు వెంటనే రాగా, దగ్గరకు రావొద్దంటూ హెచ్చరించాడు. అనంతరం అక్కడి నుంచి నిందితుడు కీర్తితేజ పరారయ్యాడు.

మాదకద్రవ్యాలకు బానిస అయ్యాడా?: ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం నిందితుడిని పంజాగుట్టలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సరోజినీదేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కీర్తితేజ మాదకద్రవ్యాలకు బానిస అయ్యాడు అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. వెల్జాన్‌ గ్రూపు సంస్థల అధినేత వీసీ జనార్దనరావు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పలు దఫాలుగా రూ.40 కోట్లు, టీటీడీకి రూ.40 కోట్ల విరాళాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు స్వచ్చంధ సంస్థలకు సైతం భారీగా విరాళాలు అందజేశారు.

ఆమె చేతిలో యువకుడు హత్య - అసలు కారణమేంటి?

'నీకు నీ భర్త బాధ వదిలింది' - మర్డర్ చేసి ప్రియురాలికి ప్రియుడి ఫోన్

VELJAN GROUP JANARDHANA RAO MURDER: ఆస్తి తగాదాల నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్‌ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దనరావును తన మనవడు అత్యంత దారుణంగా హత్య చేశాడు. హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఈ ఘటన చోటుచేసుకోగా నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరు ప్రాంతానికి చెందిన జనార్దన్‌రావు కొన్ని సంవత్సరాలుగా సోమాజిగూడలో నివాసం ఉంటున్నారు. ఇటీవల తన పెద్ద కుమార్తె కుమారుడు శ్రీకృష్ణను వెల్జాన్‌ కంపెనీకి డైరెక్టరుగా నియమించారు. అదే విధంగా మరో కుమార్తె అయిన సరోజినీదేవి కుమారుడు కిలారు కీర్తితేజ(29) పేరు మీద రూ.4 కోట్ల షేర్లను బదిలీ చేశారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి సరోజినీదేవి తన కుమారుడు కీర్తితేజతో కలిసి తండ్రి ఇంటికి వెల్లారు. ఈ సమయంలో ఆస్తి పంపకాల విషయంలో తన తాతతో కీర్తితేజ వాగ్వాదానికి దిగాడు.

తండ్రికి టీ తెచ్చేందుకు సరోజినీదేవి ఇంట్లోకి వెళ్లగా ఇదే సమయంలో కీర్తితేజ తన వెంట తెచ్చుకున్న కత్తితో తాతను 73 సార్లు పొడిచాడు. కేకలు విన్న సరోజినీదేవి వెంటనే వచ్చి కుమారుడిని వారించబోయారు. ఆ సమయంలో సరోజినీదేవి మీద కూడా దాడిచేసి కత్తితో నాలుగు చోట్ల పొడిచాడు. అక్కడే ఉన్న కాపలాదారు వీరబాబు వెంటనే రాగా, దగ్గరకు రావొద్దంటూ హెచ్చరించాడు. అనంతరం అక్కడి నుంచి నిందితుడు కీర్తితేజ పరారయ్యాడు.

మాదకద్రవ్యాలకు బానిస అయ్యాడా?: ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం నిందితుడిని పంజాగుట్టలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సరోజినీదేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కీర్తితేజ మాదకద్రవ్యాలకు బానిస అయ్యాడు అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. వెల్జాన్‌ గ్రూపు సంస్థల అధినేత వీసీ జనార్దనరావు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పలు దఫాలుగా రూ.40 కోట్లు, టీటీడీకి రూ.40 కోట్ల విరాళాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు స్వచ్చంధ సంస్థలకు సైతం భారీగా విరాళాలు అందజేశారు.

ఆమె చేతిలో యువకుడు హత్య - అసలు కారణమేంటి?

'నీకు నీ భర్త బాధ వదిలింది' - మర్డర్ చేసి ప్రియురాలికి ప్రియుడి ఫోన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.