ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

ETV Bharat / state

పల్లె పరవశించేలా కొత్త రోడ్లు - పాతవాటి మరమ్మతుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం - NDA Govt Decision for New Roads

NDA Government Decision for New Roads and Repairs in Nellore District : గత ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారులు అడుగుకో గుంత, గజానికో గొయ్యితో అధ్వానంగా మారిపోయాయి. ఇక పల్లెల్లో రోడ్లు ప్రజలకు ప్రాణ సంకటంగా తయారయ్యాయి. కొత్త రోడ్లు, మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాలని కూటమి ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

NDA GOVT DECISION FOR NEW ROADS
NDA GOVT DECISION FOR NEW ROADS (ETV Bharat)

NDA Government Decision for New Roads and Repairs in Nellore District : శ్రీ పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం రాజులపాడు గ్రామంలో సుమారు 100 కుటుంబాలు ఉన్నాయి. ఆ గ్రామంలో 300కు పైగా జనాభా నివాసిస్తున్నారు. ఈ గ్రామానికి ఏళ్లుగా సక్రమమైన రోడ్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంతో ఆ గ్రామ పరిస్థితి మారనుంది.

ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామీణ రహదారులను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. అడుగుకో గుంత, గజానికో గొయ్యితో అధ్వానంగా మారిపోయాయి. ఇక పల్లె ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. ఐదేళ్ల పాలనలో కనీసం ఒకసారి కూడా మరమ్మతులకూ ఆసక్తి చూపించలేదు. గడిచిన అయిదేళ్లలో అధికారులు ప్రతిపాదనలు పెట్టడం, జగన్​ ప్రభుత్వం వాటిని బుట్టదాఖలు చేయడం పరిపాటిగా మారింది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రహదారుల పరిస్థితిని చక్కదిద్దేందుకు నడుం బిగించింది. క్షేత్రస్థాయి నుంచి పనులను పరిశీలిస్తుంది. అత్యవసర పనులను గుర్తించి వెంటనే ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించింది. సరైన రోడ్డు సదుపాయం లేని గ్రామాలను గుర్తించడంతో పాటు గిరిజన గ్రామాలకూ ప్రత్యేకంగా నిధులు కేటాయించడానికి సన్నాహాలు చేస్తుంది.

స్వర్ణాంధ్ర-2047 విజన్‌ డాక్యుమెంట్‌ - ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశం - Swarnandhra 2047 Vision

విజన్‌ డాక్యుమెంట్‌లో భాగంగా : స్వర్ణాంధ్ర-2047 విజన్‌ డాక్యుమెంట్‌లో భాగంగా సరైన రోడ్లు లేని గ్రామాలను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. వెంటనే నిర్మాణాలు చేపట్టాలని సూచనలు చేసింది. దీనిపై నెల్లూరు జిల్లాలోని 37 మండలాల్లో సర్వే చేపట్టారు. గతంలో 500 కంటే అధిక జనాభా ఉన్న గ్రామాలను గుర్తించి రోడ్లు నిర్మించారు. తాజాగా 4 కేటగిరీలుగా పరిశీలిస్తున్నారు. 100 కంటే ఎక్కువ, 101 నుంచి 249 వరకు, 250 నుంచి 499, 500 కంటే ఎక్కువ జనాభా ప్రాతిపదికన అధికారులు సర్వే చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 60% పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రతిపాదనలు పంపుతారని అధికారులు వెల్లడించారు. ఆపై వీలైనంత త్వరగా బీటీ, సిమెంట్‌ రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలియజేశారు. దీంతో పాటు ఎన్నో ఏళ్లుగా అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్న గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రధానమంత్రి జన్‌ జాతీయ ఉన్నత్‌ గ్రామ్‌ అభియాన్‌ ద్వారా 25 రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఏపీలో రహదారులకు త్వరలో మోక్షం- గోతులు పూడ్చటానికి టెండర్లు - National highway widening works

ఇప్పటికే జిల్లా పంచాయతీరాజ్‌ పర్యవేక్షణలోని సుమారు 1482.21 కిలోమీటర్లు తారు, సీసీ రోడ్లను సాంకేతిక నిపుణులు పరిశీలించారు. వాటిలో 278.9 కి.మీ. అధ్వానంగా, మరో 301.21 కి.మీ. పాక్షిక్తంగా దెబ్బతిన్నాయని నిపుణులు అంచనా వేశారు. వీటి మరమ్మతులకు 120 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపించారు.

గ్రామీణ రహదారుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. రహదారులు లేని గ్రామాలను గుర్తించి.. వెంటనే ప్రతిపాదనలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్నాం. రహదారులకు మరమ్మతులు కూడా చేపట్టబోతున్నాం- పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ

రాష్ట్రంలో రహదారులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ - 100 రోజుల యాక్షన్ ప్లాన్ - 100 Days Action Plan for Roads

ABOUT THE AUTHOR

...view details