తెలంగాణ

telangana

500 డాలర్ల కమీషన్​ కోసం కంబోడియాకు యువకుల తరలింపు - యువతిని అరెస్ట్​ చేసిన పోలీసులు - Cambodia Job Racket Arrest

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2024, 7:39 AM IST

Cambodia Job Racket Arrest in Telangana : ఉద్యోగాల పేరిట యువకులను నమ్మించి కంబోడియా సైబర్‌ నేరాల ముఠాకు అప్పగిస్తున్న ఓ మహిళను సైబర్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

Cambodia Job Racket Arrest
Cambodia Job Racket Arrest (ETV Bharat)

Cambodia Job Racket Arrest :విదేశాల్లో ఉద్యోగాలు పేరుతో యువకులను చేరదీసి కంబోడియాలో సైబర్ నేరాగాళ్ల ముఠాకు అప్పగిస్తున్న కేసులో ముంబయికి చెందిన ప్రియాంక శివకుమార్ సిద్ధును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని బ్యూరో డైరెక్టర్ షికాగోయల్ శుక్రవారం చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

ముంబయికి చెందిన ప్రియాంక గతంలో విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించే మ్యాక్స్‌వెల్ అనే సంస్థలో ఉద్యోగం చేసింది. అనారోగ్య సమస్యలతో ఉద్యోగాం మానేసిన ప్రియాంక అనంతరం తానే సొంతంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఓవర్‌సీస్ కన్సల్టెన్సీని ప్రారంభించింది. విసిటింగ్ వీసాల మీద విదేశాలకు పంపించి అక్కడికి వెళ్లిన తర్వాత వర్క్ వీసాగా మార్చుతాం అని నమ్మించేది.

ఇదే తరహా కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న నారాయణతో ఆమెకు పరిచయం ఏర్పడింది. కంబోడియాకు వెళ్లి వచ్చిన అతను అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ అవకాశాలు ఉన్నాయని యువకులను నమ్మించేవాడు. అక్కడే చైనాకు చెందిన జాన్‌జియా అనే సంస్థకు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న జితేందర్‌ షా అలియాస్ ఆమెర్‌ఖాన్‌ను ప్రియాంకాకు పరిచయం చేశాడు.

కంబోడియాలో ఒప్పందం కుదుర్చుకుని : ఉద్యోగాలు వాటి వివరాలు తెలుసుకునేందుకు ప్రియాంక కంబోడియాకు వెళ్లింది. అక్కడ జితేందర్‌ను కలిసింది. ఉద్యోగాల కోసం పంపించే ఒక్కొక్కరికి 500 అమెరికా డాలర్ల కమీషన్ ఇస్తానని ప్రియాంకాతో ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం భారత్‌కు తిరిగి వచ్చిన ప్రియాంక యువకుల వేట ప్రారంభించింది.

విదేశాల్లో చదువు, ఉద్యోగాల కోసం నకిలీ సర్టిఫికెట్ల కేసు.. పోలీసుల దర్యాప్తు ముమ్మరం

ప్రియాంక మొదటగా తన సోదరి కుమారుడైన అక్షయ్ వైద్య, అతని స్నేహితుడు డానిష్‌ఖాన్‌లను కంబోడియాకు పంపించింది. అక్కడికి వెళ్లిన తర్వాత జితేందర్ వారితో సైబర్ నేరాలు చేయించడం మొదలు పెట్టాడు. మరోపక్క కంబోడియాలో హై పేయింగ్ జాబ్స్ ఉన్నాయంటూ ప్రియాంక సామాజిక మాధ్యమాలు, న్యూస్ పేపర్లలో ప్రకటన ఇచ్చింది.

సైబర్ నేరాలు చేయడానికి ఒప్పుకోనందుకు చిత్రహింసలు :ఇది చూసి హైదరాబాద్‌కు చెందిన వంశీకృష్ణ, సాయిప్రసాద్‌లు ఆమెను సంప్రదించారు. వారిని కంబోడియాకు పంపెందుకు వారి దగ్గర నుంచి రూ.30వేల చొప్పున కమీషన్ తీసుకుని పంపించింది. కంబోడియాకు వెళ్లిన వారిద్దరిని సైబర్ నేరాలు చేయాలని ఒత్తిడి చేశారు. ఒప్పుకోకపోతే మానసికంగా, శారీరకంగా నానా ఇబ్బందులు పేట్టారు. సైబర్ విధుల్లో పాల్గొనకుంటే చిత్రహింసలకు గురిచేశారు. అ

తికష్టం మీద వారు స్వదేశానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన సైబర్ అధికారులు ప్రియాంక విషయం తెలిసి ముంబయిలో అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు తీసుకొచ్చి రిమాండ్‌ చేశామని పోలీసులు వివరించారు. ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్లేముందు ఎంతో అప్రమత్తంగా ఉండాలని సరైన వీసా ఇస్తున్నారా లేద గమనించాలని సూచించారు. ఏజెంట్లు అధిక మొత్తంలో డబ్బులు కమీషన్ అడుగుతున్నట్లు అయితే అనుమానించాలని హెచ్చరించారు.

'ఈ అన్నాచెల్లెళ్ల కోసం 3 రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు' - Brother And Sister Company Fraud

గవర్నమెంట్​ జాబ్​ పేరిట నిరుద్యోగులకు వల - రూ.60 లక్షలకు కుచ్చుటోపీ - Jobs Fraud in Jayashankar Bhupalpal

ABOUT THE AUTHOR

...view details