Manchu mohanbabu Vs Manoj :సీనియర్ నటుడు మోహన్బాబు పోలీసులను ఆశ్రయించారు. తన కుమారుడు, హీరో మనోజ్, అతడి భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని రాచకొండ కమిషనర్కు కంప్లైంట్ చేశారు. తన ప్రాణానికి, ఆస్తులకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పోలీసులను మోహన్ బాబు కోరారు. అసాంఘిక శక్తులుగా మారిన కొంతమంది నుంచి తనకు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు.
30 మంది వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు : 'నేను జల్పల్లిలో 10 సంవత్సరాలుగా నివాసముంటున్నాను. 4 నెలల కిందట నా చిన్న కుమారుడు ఇల్లు వదిలి వెళ్లాడు. మనోజ్ కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి నా నివాసం వద్ద కలవరం సృష్టించాడు. మనోజ్ తన 7 మాసాల బిడ్డను ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు. మాదాపూర్లో గల నా కార్యాలయంలోకి 30 మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడ్డారు. వారిద్దరూ( మనోజ్, మౌనికలు) నా ఇంటిని అక్రమంగా ఆక్రమించుకొని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. నా భద్రతపై, ఆస్తులు, విలువైన వస్తువుల విషయంలో నేను భయపడుతున్నాను' అని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.