Minister Sridhar Review and Arrangements for Assembly Sessions : శాసనసభ సమావేశాలకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా సజావుగా జరిగేట్లు అవసరమైన భద్రత ఏర్పాటు చేయాలని, సభ్యుల ప్రశ్నలకు త్వరితగతిన సమాధానాలు అందేట్లు చూడాలని స్పీకర్ ప్రసాద్కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై ఇవాళ అసెంబ్లీలో శాసన సభ సమావేశాలు - నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు.
Council Chairman Gutha Sukender Reddy about Assembly Session :సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు త్వరితగతిన అందించాలని, సమావేశాల సమయంలో సంబంధిత అధికారులు తప్పకుండా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మండలి షిఫ్టింగ్ త్వరగా జరిగేలా చర్యలు చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకునేలా శాసన సభ వ్యవహారాల మంత్రి తోడ్పాటు అందించాలని కోరారు. భద్రత, రక్షణ వ్యవహారాల విషయంలో పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, సమావేశాల సమయంలో ధర్నాలు, ర్యాలీల అనుమతి విషయంలో ఆచితూచి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమావేశాలు నిర్వహించేలా చూడాలని, ఇందుకు తగిన ఏర్పాట్లు ఆయా విభాగాల అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని శాసన సభ స్పీకర్(Assembly Speaker) గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులను ఆదేశించారు. సభ్యుల ప్రశ్నలకు సాధ్యమైనంత త్వరగా సమాధానాలు ఇవ్వాలని, సమావేశాలు జరుగుతున్నప్పుడు మంత్రులు అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్న డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అసెంబ్లీ కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలన్నారు.