ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మడ అడవులు విధ్వంసం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు : పవన్ కల్యాణ్ - Pawan on Mada Forests Protection

Pawan Kalyan on Mada Forests Protection : మడ అడవుల రక్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల కోసం 110 ఎకరాల మడ అడవుల్ని తొలగించిందని, ఈ అంశంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపించేందుకు అవసరమైన కుంకీ ఏనుగులను కర్ణాటక నుంచి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని పవన్‌ చెప్పారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 9:37 AM IST

Pawan Kalyan on Mada Forests Protection
Pawan Kalyan on Mada Forests Protection (ETV Bharat)

Minister Pawan on Mangrove Forest : ప్రపంచ మడ అడవుల సంరక్షణ దినోత్సవం వేళ అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మడ అడవులపై రూపొందించిన గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. వీటి పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు తెలియజేయగా, పవన్‌ సవివరంగా తెలుసుకున్నారు.

Mada Forests in AP : ప్రకృతి విపత్తుల నుంచి మానవులను రక్షించేందుకు మడ అడవులే ముందు వరసలో ఉంటాయని మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. వీటిని సంరంక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మడ అడవుల ప్రాంతంలో పారిశ్రామిక, ప్లాస్టిక్ వ్యర్థాలు కలవకుండా నిరోధించాలని ఆదేశించారు. వీటిని విధ్వంసం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మిస్టీ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో మడ అడవుల విస్తీర్ణం పెంపునకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్పొరేట్ సంస్థలు వీటి పరిరక్షణలో భాగస్వాములు కావాలని పవన్‌ కల్యాణ్ పిలుపునిచ్చారు.

"తీరప్రాంత వైవిధ్యానికి మడ అడవులు ఎతో అవసరం. ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను రక్షించడానికి ఇవి ఎంతో దోహదపడుతున్నాయి. ప్రజలకు వీటిపై అవగాహన లేక వీటిని నరికివేస్తున్నాం. ఇది ప్రకృతి అందించిన వరం. మడ అడవులు రక్షించాల్సి బాధ్యత మనందరిపై ఉంది." - పవన్ కల్యాణ్, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి

ఏనుగుల వల్ల పంటల ధ్వంసంపైనా చర్చించిన పవన్‌ :ఏనుగుల వల్ల పంటల ధ్వంసం, రైతులకు వస్తున్న సమస్యలపై అటవీశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో మంత్రి పవన్‌ కల్యాణ్ ప్రస్తావించారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల నుంచి రైతులు, ప్రజలు తన దృష్టికి సమస్యను తీసుకువచ్చారన్నారు. పొలాల్లోకి, నివాస ప్రాంతాల్లోకి వచ్చే ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపించేందుకు అటవీ శాఖ దగ్గర కుంకీ ఏనుగుల కొరత ఉందని, అధికారులు పవన్​కు తెలిపారు.

కర్ణాటకలో కుంకీ ఏనుగులు ఉన్నాయని అధికారులు పవన్​ కల్యాణ్​కు తెలిపారు. కనీసం ఐదు ఈ తరహా ఏనుగులను కర్ణాటక నుంచి తెచ్చుకోగలిగితే సమస్యను నివారించవచ్చని చెప్పారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వంతో కుంకీ ఏనుగుల గురించి చర్చిస్తానని పవన్‌ తెలిపారు. వన్య ప్రాణులు రాకుండా విద్యుత్ ఫెన్సింగ్ వేసుకొనే విధానాలు విడిచిపెట్టేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు.

మడ అడవులను మడతెట్టెసెయ్..నీ వెనుక నేనున్నా..!

ఆక్రమణల పర్వం.. 'మడ' మనుగడకు నష్టం..!

ABOUT THE AUTHOR

...view details