ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బ్యారేజీని కూల్చి లక్షకుపైగా జనాన్ని చంపాలన్నదే జగన్ లక్ష్యం: మంత్రి లోకేశ్ - Nara Lokesh Fire on Jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 10, 2024, 3:36 PM IST

Updated : Sep 10, 2024, 4:54 PM IST

Minister Nara Lokesh Fire on Jagan: వరదలకు ప్రభుత్వమే కారణమంటూ వైఎస్సార్సీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్​సీపీ కుట్రలు బయటపడకుండా ఆ పార్టీ నేతలు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. లక్షలాది మంది జలసమాధి అయ్యేలా సైకో జగన్‌ పన్నిన కుట్ర బట్టబయలైందన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో లోకేశ్ పోస్ట్‌ చేశారు.

nara_lokesh_fire_on_jagan
nara_lokesh_fire_on_jagan (ETV Bharat)

Minister Nara Lokesh Fire on Jagan:ప్రకాశం బ్యారేజీని కూల్చి లక్ష మందికి పైగా ప్రజలను చంపాలన్నదే జగన్‌ లక్ష్యమని మంత్రి లోకేశ్ ధ్వజమెత్తారు. అధికారం అండతో జగన్‌ ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేశారని గుర్తుచేశారు. 50 మందిని చంపేసి 5 ఊళ్లు నామరూపాలు లేకుండా చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని కూల్చేసి విజయవాడతో పాటు లంక గ్రామాలను నామ రూపాల్లేకుండా చేయాలని చూశారన్నారు. లక్షలాది మంది ప్రజలు జల సమాధి అయ్యేలా జగన్‌ పన్నిన కుట్ర బట్టబయలైందని తెలిపారు.

ప్రకాశం బ్యారేజీని కూల్చేయాలనే కుట్ర ప్లాన్‌ చేసింది జగన్‌ అయితే దాన్ని అమలు చేసింది వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అని ఆరోపించారు. వారి కుట్రలు బయటపడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ జగన్‌ ముఠా విష ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.

Varla Ramaiah:ప్రకాశం బ్యారేజ్​ను ఇసుక పడవలు ఢీ కొట్టడం జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్, తలశీల రఘురాంల కుట్రేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. జగన్ గత ఐదేళ్ల పరిపాలన అంతా అరాచకం, అస్తవ్యస్తమని మండిపడ్డారు. కుట్రలు కుతంత్రాలతో కూడుకున్న పాలన జగన్​దని విమర్శించారు. జాతీయ సంపదైన ప్రకాశం బ్యారేజ్​ను కుట్రతో ధ్వంసం చేయాలనుకున్నారని ఇది దేశ ద్రోహం నేరంతో సమానమని తెలిపారు.

చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని కుట్ర పన్ని పడవలతో బ్యారేజ్​ను ఢీ కొట్టేలా ప్లాన్ చేశారని ధ్వజమెత్తారు. ఆ పడవలు సరిగా బ్యారేజ్​ను ఢీకొని ఉంటే ఆ ప్రమాదం ఉప్పెన కంటే ఘోరంగా ఉండేదని ఊర్లన్నీ మునిగిపోయి ప్రజల ధన, ప్రాణాలు పోయేవన్నారు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో కూడా ఇది కుట్ర అని ఈ పడవల ఢీ కొన్నదాని వెనుక ఎవరు ఉన్నా శిక్షిస్తామని వారు తెలిపినట్లు వర్ల రామయ్య అన్నారు.

నేటి సాయంత్రంలోగా విజయవాడ సాధారణ స్థితికి రావాలి- అధికారులతో అర్ధరాత్రి వరకూ సీఎం సమీక్ష - CM Chandrababu on Relief Operations

MLA Bojjala Sudhir:జగన్ పిచ్చి పిచ్చిగా తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ దుయ్యబట్టారు. ప్రజలు బాధల్లో ఉంటే బురద రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్​సీపీ హయాంలో వరదలు వస్తే జగన్ పబ్జీ ఆడుకున్నారని కాని చంద్రబాబు వరదల్లో ప్రజల కోసం పని చేస్తున్నారని తెలిపారు. గతంలో లక్షల రూపాయల చెప్పులు వేసుకునే జగన్ ఈ వరదల్లో రబ్బర్ చెప్పులేసుకుని నీళ్లల్లో దిగారని, చెప్పుల పాడవ్వకూడదని జాగ్రత్తగా నీళ్లల్లో దిగే మనస్తత్వం జగన్‌దని విమర్శించారు. తన నియోజకవర్గంలోని పారిశ్రామిక వేత్తలు స్పందించారని, ఇవాళ ఇద్దరు పారిశ్రామిక వేత్తలు 75 లక్షల రూపాయల విరాళం ఇచ్చారని తెలిపారు. ఇప్పటికే శ్రీకాళహస్తి నుంచి కోటిన్నర రూపాయలకు పైగా నిధులు వరద సాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్​కు అందించామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌ వెల్లడించారు.

బుడమేరు కన్నీరు - సర్వం తుడిచి పెట్టేసిందని ఘొల్లుమంటున్న బాధితులు - Home Appliances damage

ముగింపు దశకు చేరిన పునరుద్ధరణ పనులు - నేడు విజయవాడలో కేంద్ర వైద్య బృందం పర్యటన - Vijayawada Gradually Recovering

Last Updated : Sep 10, 2024, 4:54 PM IST

ABOUT THE AUTHOR

...view details