ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 22, 2024, 9:06 PM IST

ETV Bharat / state

వైసీపీ నేతలు, కార్యకర్తల చేరికలతో కూటమిలో మరింత ఊపు - Massive exodus from YSRCP into TDP

Massive exodus from YSRCP into TDP: రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల ఉద్ధృతి కొనసాగుతుంది. గ్రామాలు పట్టణాలు అంటూ తేడా లేకుండా నేతలు, కార్యక్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అందరూ కలసికట్టుగా పనిచేసి కూటమి విజయానికి కృషి చేస్తామని నేతలు పేర్కొన్నారు.

Massive exodus from YSRCP into TDP
Massive exodus from YSRCP into TDP

Massive exodus from YSRCP into TDP:ఓ వైపు నామినేషన్లు, మరోవైపు ప్రచారంలో దూసుకెళ్తున్న కూటమి అభ్యర్థులకు, ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తల చేరికలు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఐదేళ్ల వైసీపీ పాలనతో విసిగిపోయిన స్థానిక ప్రజాప్రతినిధులు, కీలక నేతలు వరసగా వలస బాట పడుతున్నారు. అభ్యర్థులు వారికి పసుపు కండువాలు కప్పి తెలుగుదేశంలోకి ఆహ్వానిస్తున్నారు. అందరూ కలసికట్టుగా పనిచేసి కూటమి విజయానికి కృషి చేయాలని సూచిస్తున్నారు.

మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. 2019లో కాంగ్రెస్‌ తరఫున అసెంబ్లీకి పోటీచేసిన చలమల శెట్టి ఆదికిరణ్, కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర సమక్షంలో పార్టీలో చేరారు. విజయవాడకు చెందిన వైసీపీ నేత మండవ వెంకట్రామ్ చౌదరి, విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజకవర్గాలకు చెందిన 50 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో లోకేశ్‌ వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గుడివాడకు చెందిన వైసీపీ కీలక నేత, నియోజకవర్గ బీసీ సంఘ అధ్యక్షుడు దారం నరసింహారావు, కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము సమక్షంలో తెలుగుదేశంలో చేరారు.

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మర వాండ్లపల్లి ఎంపీటీసీ పుల్లయ్య, కూటమి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. నంబులపూలకుంట మండలానికి చెందిన పలువురు పంచాయతీ వార్డు సభ్యులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కుమ్మరవాండ్లపల్లి పంచాయతీలోని బాలప్పగారిపల్లి, మత్తినగారిపల్లి గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న కందికుంట సమక్షంలో వీరు పార్టీలో చేరారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో వైసీపీకిఎదురుగాలి వీస్తోంది. నందలూరు మండలం చింతకాయలపల్లికి చెందిన 200 కుటుంబాలు వైసీపీను వీడి తెలుగుదేశంలో చేరాయి. రాజంపేట కూటమి అభ్యర్థి సుగవాసి బాల సుబ్రహ్మణ్యం వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


పులివెందులలో వైసీపీకి గుడ్ బై చెబుతున్న నేతలు - బీటెక్ రవి సమక్షంలో టీడీపీలోకి చేరికలు - YCP leaders joining TDP

నెల్లూరు రూరల్ మండలం కొత్త వెల్లంటి సర్పంచ్ లక్ష్మి వైసీపీకి రాజీనామా చేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో సైకిలెక్కారు. వీరితోపాటు గ్రామానికి చెందిన పలువురు నాయకులు టీడీపీ గూటికి చేరారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు ప్రచారం నిర్వహించారు. లావేరు మండలానికి చెందిన 50 వైసీపీ కుటుంబాలు ఈశ్వరరావు సమక్షంలో బీజేపీలో చేరాయి.


అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్‌ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కూటమి అభ్యర్థి సత్యకుమార్‌కు మద్దతుగా సామాజికవేత్త రాజగోపాల్‌ ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నంలో కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు, ఇంటింటి ప్రచారం చేస్తూ సూపర్‌ సిక్స్‌ పథకాల కరపత్రాలను అందించి ఓట్లు అభ్యర్థించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ తరఫున ఆయన సతీమణి కృష్ణతులసి స్థానిక మహిళలతో కలసి ఇంటింటి ప్రచారం నిర్వహించి కూటమికి ఓట్లు వేయాలని కోరారు. కడపలో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం వారి భార్యలు ప్రచారం నిర్వహించారు. అవినాష్‌ రెడ్డి సతీమణి సమత, అంజాద్‌ బాషా భార్య ఫాతిమా, కడప పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఫ్యాన్ వేడిగాలి తట్టుకోలేక- దూసుకుపోతున్న సైకిల్ ఎక్కి సేదతీరుతోన్న వైసీపీ నేతలు - YSRCP leaders Join In TDP

వైసీపీ నేతలు, కార్యకర్తల చేరికలతో కూటమిలో కొత్త జోష్‌

ABOUT THE AUTHOR

...view details