ఆంధ్రప్రదేశ్

andhra pradesh

585 గుర్తింపు-మరో వెయ్యి అనధికారికంగా - కడప జిల్లాలో విచ్చలవిడిగా అక్రమ లేఔట్లు - corruption jagananna housing

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 3, 2024, 10:34 AM IST

Updated : Aug 3, 2024, 11:31 AM IST

Irregularities in Jagananna Housing Layout in Kadapa District : అధికారం ఉందన్న అండ చూసుకొని గత ఐదేళ్లులో వైఎస్సార్సీపీ నేతలు అక్రమ భూదందాకు పాల్పడ్డారు. అనధికారంగా అక్రమ లేఅవుట్లు వేసి భూదందాకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే వైఎస్సార్​ జిల్లా వ్యాప్తంగా 585 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిపై టౌన్​ ఫ్లానింగ్​ రాష్ట్ర అదనపు డైరెక్టర్​ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.

ysrcp_irregularities_jagananna_housing
ysrcp_irregularities_jagananna_housing (ETV Bharat)

Irregularities in Jagananna Housing Layout in Kadapa District :ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు ప్రభుత్వ భూములు ఆక్రమించి విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు వేసి భూ దందాకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. జిల్లావ్యాప్తంగా 585 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. అనధికారికంగా మరో వెయ్యి వరకు ఉంటాయని అంచనా. వీటిపై సమగ్ర విచారణ చేయడానికి టౌన్ ప్లానింగ్ రాష్ట్ర అదనపు డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణ బృందాలను నియమించారు. ఇప్పటికే జిల్లాకు చేరుకున్న ఈ బృందాలు 3 రోజులపాటు జిల్లాలో పర్యటించి ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించనున్నాయి.

ఇష్టారాజ్యంగా ప్రభుత్వభూములు ఆక్రమణ :వైఎస్సార్సీపీ నాయకులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఉమ్మడి కడప జిల్లాలో ఇష్టారాజ్యంగా ప్రభుత్వభూములు ఆక్రమించారు. రెవెన్యూ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాయడంతో ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం అయ్యాయి. కబ్జా చేసిన స్థలాల్లో రియల్ ఎస్టేట్ పేరుతో వెంచర్లు వేసి భారీగా సొమ్ము చేసుకున్నారు. సెంటు స్థలం 10 నుంచి 13 లక్షల వరకు విక్రయిస్తున్నారు. లేఅవుట్లకు ఎలాంటి అనుమతులు లేకపోయినా యథేచ్చగా నిర్మాణాలు సాగిస్తున్నారు.

జగన్​ సొంత నియోజకవర్గంలో భారీగా అక్రమాలు- అనర్హులకు హౌసింగ్​ లేఅవుట్ కేటాయింపు - corruption jagananna housing

పెద్ద ఎత్తున అక్రమ లేఅవుట్లు : కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు, రాయచోటి, కమలాపురం నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అక్రమ లేఅవుట్లు వెలిశాయి. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా 585 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. వీటిలో అత్యధికంగా కడప నగరంలోనే 400 వరకు ఉన్నట్లు గుర్తించారు. వీటిపై విచారణ చేయాలని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పురపాలకశాఖ మంత్రి నారాయణ విచారణకు ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ రాష్ట్ర అదనపు డైరెక్టర్ నాగసుందరి కడపకు చేరుకున్నారు. ఆమె ఆధ్వర్యంలో అధికారులు 10 బృందాలుగా విడిపోయి క్షేత్రస్థాయిలో అక్రమ లే అవుట్లపై విచారణ ప్రారంభించారు. మదనపల్లె కంటే భారీ స్థాయిలో కడపలో వేల ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జా చేశారని ప్రజాసంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.

ఐదేళ్ల సమస్యలపై వినతుల వెల్లువ - టీడీపీ కేంద్ర కార్యాలయానికి పోటెత్తిన బాధితులు - YSRCP Victims at TDP Central Office

మదనపల్లె డివిజన్‌లో రెవిన్యూ అధికారుల బాగోతం బహిర్గతమై మాజీమంత్రి పెద్దిరెడ్డి మెడకు చుట్టుకుంది. ఆ తరహా వ్యవహారం కడప జిల్లాలోనూ విచ్చలవిడిగా సాగిందని వీటిపై సీఎం చంద్రబాబు దృష్టి సారిస్తే భారీ అక్రమాలు వెలుగు చూస్తాయని స్థానికులు చెబుతున్నారు.

నాబార్డు నిధులను దారి మళ్లించిన వైఎస్సార్సీపీ సర్కార్​ - నిలిచిన బాపట్ల వైద్య కళాశాల నిర్మాణం - Medical College Construction

Last Updated : Aug 3, 2024, 11:31 AM IST

ABOUT THE AUTHOR

...view details