ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టు గ్రీన్​సిగ్నల్- "కండిషన్స్ అప్లై" - HC GREEN SIGNAL GANESH IMMERSION

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 10, 2024, 7:17 PM IST

Ganesh Immersion at HussainSagar : హుస్సేన్​సాగర్​లో వినాయక నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. 2021లో రూపొందించిన మార్గదర్శకాలనే పాటించాలని సూచించింది. మట్టి, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

TG HC Green Signal Ganesh Immersion
TG HC Green Signal Ganesh Immersion (ETV Bharat)

TG High Court Green Signal To Ganesh Immersion 2024 : హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జన వేడుకలపై తెలంగాణ హైకోర్టు స్పష్టత ఇచ్చింది. 2021లో రూపొందించిన మార్గదర్శకాలనే పాటించాలని సూచనలు చేసింది. మట్టి, ఎకో ఫ్రెండ్లో విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్లాస్టర్​ ఆఫ్​ ప్యారిస్​ (పీవోపీ) విగ్రహాలను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన కృత్రిమ నీటికుంటలోనే నిమజ్జనం చేయాలని ఆదేశాలిచ్చింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌ ఇంత ఆలస్యంగా ఎందుకు వేశారని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది.

ABOUT THE AUTHOR

...view details