తెలంగాణ

telangana

బీటెక్​ కాలేజీలో దారుణం - అమ్మాయిల​​ వాష్​రూమ్​లో హిడెన్​ కెమెరాలు - అబ్బాయిలకు వీడియోలు విక్రయం! - HIDDEN CAMERAS IN GIRLS WASHROOMS

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2024, 11:18 AM IST

Hidden Cameras In BTech Girls Washrooms In AP : ఏపీలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీక్రెట్‌ కెమెరాల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. బాలికల హాస్టల్‌ వాష్‌రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు ఆరోపించారు. ఈ విషయంపై బాలికల హాస్టళ్లలో హిడెన్‌ కెమెరా గుర్తించారంటూ ‘ఎక్స్‌’ వేదికగా విద్యార్థుల పోస్టులు పెడుతున్నారు. వారం క్రితమే ఘటన వెలుగు చూసినా యాజమాన్యం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.

Hidden Cameras In Girls Hostel In AP
Hidden Cameras In Girls Hostel In AP (ETV Bharat)

Hidden Cameras In Girls Hostel In AP :ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాలలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఈ అంశంపై అర్ధరాత్రి విద్యార్ధినులు కళాశాల ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. బాలికల హాస్టల్​లోని బాత్‌రూమ్‌లలో రహస్య కెమెరాలు ఉంచారంటూ వసతిగృహ ప్రాంగణంలో విద్యార్థునులు నిరసన తెలిపారు. సెల్​ఫోన్ టార్చ్​లైట్లు వేస్తూ తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.

ఈ కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లోకి పంపుతూ, వాటిని విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిపై సహచర విద్యార్ధులు దాడికి యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కళాశాల వసతి హాస్టల్​కు చేరుకున్నారు. వారితో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

రహస్య కెమెరా ఘటనపై పోలీసులు ఆరా :జూనియర్, సీనియర్ విద్యార్థులతో చర్చించారు. తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు ఆందోళన కొనసాగించిన విద్యార్ధులు, ఆ తర్వాత పోలీసుల జోక్యంతో శాంతించారు. అనంతరం సీక్రెట్ కెమెరాల వ్యవహారం గురించి బీటెక్ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థిని పోలీసులు ప్రశ్నించారు. అతడి ల్యాప్‌ట్యాప్‌, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. కెమెరా ఏర్పాటులో అతడిని మరో విద్యార్థిని సహకరిస్తోందంటూ పలువురు ఆరోపిస్తున్నారు.

ఈ విషయం గురించి, బాలికల హాస్టల్​లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా చేసిన పోస్టులను సైతం విద్యార్ధినులు పోలీసులకు చూపించారు. ఈ విషయం వారం రోజుల క్రితమే వెలుగు చూసిందని తెలిపారు. వారం రోజులుగా ఇంత జరుగుతున్నా బాధ్యులపై యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

ఘటనపై ప్రభుత్వం సీరియస్ : గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానన్నారు. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.‌ ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

విచారణకు ఆదేశించిన ఏపీ సీఎం చంద్రబాబు : గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల ఆరోపణలపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. మంత్రి కొల్లుతో పాటు కలెక్టర్, ఎస్పీ ఘటనాస్థలికి వెళ్లాలన్నారు.

Asifabad Gurukula School Students Protest : 'మాకు ఈ ప్రిన్సిపల్​ వద్దు అంటే వద్దు'

Secret Camera in Girls Room : ఇంటి ఓనర్ పాడుపని.. అమ్మాయిల గదిలో సీక్రెట్ కెమెరా పెట్టి..!

ABOUT THE AUTHOR

...view details