ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దుర్గమ్మకు ఇచ్చే ఈ ఐదు హారతులు ప్రాముఖ్యత మీకు తెలుసా? - Indrakeeladri Dussehra Celebration

హిందూ సంప్రదాయంలో హారతికి ఎంతో ప్రాధాన్యం

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Published : 4 hours ago

Harati Priority In Vijayawada Indrakeeladri Dussehra Celebration
Harati Priority In Vijayawada Indrakeeladri Dussehra Celebration (ETV Bharat)

Harati Priority In Vijayawada Indrakeeladri Dussehra Celebration :హిందూ సంప్రదాయంలో హారతికి ఎంతో ప్రాధాన్యం ఉంది. మనం చేసే పూజలు ఫలించాలంటే హారతి ఇవ్వడం తప్పనిసరి. ఒకవేళ ఇవ్వకపోతే అసంపూర్ణంగా భావిస్తాం. అలాంటిది విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను స్తుతిస్తూ రుత్వికులు నిత్యం పంచ హారతులు సమర్పిస్తారు. సమస్త లోకం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ వీటిని ఇస్తారు. హారతి వల్ల మంగళం కలుగుతుందని భక్తుల అపార నమ్మకం. దసరా వేడుకల్లో వివిధ రూపాల్లో ఉన్న జగన్మాత దుర్గమ్మకు వీటిని కనుల పండుగగా ఇస్తారు. వీటిని తిలకించేందుకు రెండు కళ్లు సరిపోవు అంటే అతిశయోక్తి కాదు.

అన్ని మంత్రాలకు మూలం ఓంకారం :సాయం సంధ్యవేళ నివేదన అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణ నడుమ ఓంకార హారతి ఇస్తారు. అన్ని మంత్రాలకు మూలం ఓంకారం. ఓంకార రూపాన్ని వీక్షించడంతో సమస్త పాపాలు తొలగిపోతాయన్నది భక్తుల విశ్వాసం.

అన్ని మంత్రాలకు మూలం ఓంకారం (ETV Bharat)

దీర్ఘాయువును ప్రసాదించే నాగ దేవత :పంచహరతుల్లో రెండవది నాగ హారతి. దేవతా స్వరూపమైన నాగ సర్పం దీర్ఘాయువుకు పవిత్రతకు ప్రతీక. నాగ హారతిని దర్శించడం వలన సకలరోగాలు నివారించబడతాయని భక్తుల నమ్మకం. దీంతోపాటు సర్పదోషాలు తొలగిపోతాయి.

దీర్ఘాయువును ప్రసాదించే నాగ దేవత (ETV Bharat)

పరమేశ్వరుని పంచముఖాలకు ప్రతిరూపం :జగన్మాత దుర్గమ్మకు ఇచ్చే మహిమాన్వితమైనది పంచహారతి. పరమేశ్వరిని పంచముఖాలకు ప్రతి రూపంగా దీన్ని భావిస్తారు. ఈ హారతిని వీక్షిస్తే భక్తులకు పంచ మహాపాతకాలు తొలగుతాయి. పంచ ప్రాణాలకు సాంత్వన కలుగుతుంది. దుర్గామల్లేశ్వర స్వామి వార్ల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని భక్తుల అపార నమ్మకం.

పరమేశ్వరుని పంచముఖాలకు ప్రతిరూపం (ETV Bharat)

భూమండలాన్ని రక్షించే కుంభ హారతి :పంచ హారతుల్లో నాల్గోది కుంభ హారతి. సమస్త భూమండలాన్ని రక్షించే ఈ హారతిని తిలకించడంతో జీవ రక్షణ లభిస్తుంది. సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. భక్తులకు అనన్యమైన పుణ్యం సిద్ధిస్తుంది.

భూమండలాన్ని రక్షించే కుంభహారతి (ETV Bharat)

అన్ని నక్షత్ర రాశుల వారికి :పంచ హారతుల్లో చివరిది నక్షత్ర హారతి. సకల నక్షత్ర రాశుల వారి వీక్షణార్థం ఈ హారతిని అమ్మవారికి సమర్పిస్తారు. 27 నక్షత్రాల్లో జన్మించిన వారు రాశీఫలాలతో సంబంధం లేకుండా వీక్షిస్తే ప్రయోజనం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.

అన్ని నక్షత్ర రాశుల వారికి (ETV Bharat)

తొలిరోజు బాలాత్రిపురసుందరీదేవిగా అమ్మవారు - ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు - Dussehra Celebrations 2024

కృష్ణానదికి నవ హారతుల కార్యక్రమం పునః ప్రారంభం - NAVAHARATULU TO KRISHNA

ఆ రూట్లలో వెళ్లేవారికి 'హ్యాపీ జర్నీ' - 644 'దసరా స్పెషల్'​ ట్రైన్స్ - railway stations rush

ABOUT THE AUTHOR

...view details