Choutuppal Death Case : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో సైదులు అనే వ్యక్తి తన కుమారుడిని కొట్టడంతో ఆ బాలుడు మృతి చెందాడు. 9వ తరగతి చదువుతున్న ఆ బాలుడు తమ పాఠశాలలో శనివారం నిర్వహించిన ఫేర్వెల్ పార్టీకి వెళ్లాడు. అయితే, ఇంటికి ఆలస్యంగా వచ్చాడన్న కోపంతో మద్యం మత్తులో సైదులు విద్యార్థిని చితకబాదాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు : ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. పోస్టుమార్టం లేకుండా ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వాసుపత్రికి పంపించారు. నిందితుడు సైదులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.