Farmers Problems For Seeds In Telangana: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పచ్చిరొట్ట విత్తనాలు కోసం అన్నదాతలు ఆగ్రో రైతు సేవా కేంద్రాలు చుట్టు తిరుగుతున్నారు. జీలుగు, జనుము విత్తనాల కోసం పడిగాపులు గాస్తున్నారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలు అన్నీ కలిపి మెుత్తం 5,840 క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేయగా 2,306 క్వింటాళ్ల విత్తనం మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది.
ప్రభుత్వం ఈ విత్తనాలపై 60 శాతం రాయితీ అందిస్తుంటడంతో కొనుగోలు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. కానీ డిమాండ్ తగ్గట్లుగా నిల్వలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం పంటలు సాగుచేసే ముందు పచ్చిరొట్ట పంటలు సాగు చేసి భూమిలో కలియదున్నతే పంటకు, భూమికి కావాల్సిన పోషకాలు అందుతాయి. గతంలో దీనిపై రైతుల్లో పెద్దగా అవగాహన ఉండేది కాదు. పచ్చిరొట్ట సాగుపై వ్యవసాయ శాఖ సైతం విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో ఎక్కువమంది జీలుగు, జనుము సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
విత్తు కోసం విపరీత రద్దీ - నాణ్యమైన విత్తనాల కోసం ఎగబడ్డ సాగుదారులు - Seed Mela in jagtial
విత్తనాల కోసం ఎదురుచూపులు : గత ఏడాదితో పోల్చితే ఈసారి వానలు మే నెలలోనే ప్రారంభమయ్యాయి. రైతులు ముందస్తుగా సాగుకు సన్నద్ధమవుతున్నారు. దీంతో పచ్చిరొట్ట విత్తనాలకు డిమాండ్ ఏర్పడింది. జనుము కంటే జీనుగ వేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. కానీ ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాల్ని దిగుమతి చేసుకోవడంలో జాప్యం జరుగుతోంది. దీంతో సకాలంలో విత్తనాలు అందడం లేదు. అధికారులు మాత్రం విత్తనాలకు ఎలాంటి కొరత లేదని చెబుతున్నారు.