తెలంగాణ

telangana

ETV Bharat / state

3 రోజులుగా నీటిలోనే ఆలయం - ఉత్సవ విగ్రహమే భక్తులకు దర్శనం - ఎక్కడంటే?

మూడు రోజులుగా జలదిగ్బంధంలో ఏడుపాయల క్షేత్రం - గర్భగుడి ముందు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మంజీరా నది - ప్రధాన ఆలయానికి తాళం, ఉత్సవ విగ్రహానికి పూజలు

Edupayala Temple In Medak
Huge Flood Water At Edupayala Temple (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Huge Flood Water At Edupayala Temple :మెదక్ జిల్లాలో మంజీరా నది ఉద్ధృతికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ భవాని క్షేత్రం గత మూడు రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో గర్భ గుడి ముందు ఉన్న నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో గర్భగుడిలోకి వెళ్లడం, పూజలు చేయడం కష్టంగా మారింది. అటు భక్తులు కూడా ఆలయానికి వచ్చే అవకాశం లేకపోవడంతో తాత్కాలికంగా ప్రధాన ఆలయాన్ని మూసివేశారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు : భక్తుల సౌకర్యార్థం రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అక్కడే అమ్మవారి దర్శనం కల్పిస్తూ తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామునే ఆలయ అర్చకులు, అమ్మవారికి మంజీరా జలాలతో అభిషేకం, సహస్ర నామార్చన, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు చేశారు. వరద తీవ్రత తగ్గగానే యధావిధిగా మూల విరాట్ దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు.

రైతులు అప్రమత్తంగా ఉండాలి: మరోవైపు వనదుర్గ ఆనకట్ట వద్ద ప్రవాహం పొంగిపొర్లుతుండటంతో మంజీరా నది పరివాహక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ అధికారులు హెచ్చరించారు. గత సెప్టెంబర్​లో భారీ వర్షాలు కురిసిన సమయంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు మళ్లీ సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలతో ఈ సమస్య ఎదురైంది.

మహిషాసుర మర్దినిగా ఏడుపాయల వనదుర్గా మాత అమ్మవారి దర్శనం

అన్నపూర్ణా దేవిగా దర్శనమిస్తున్న ఏడుపాయల వన దుర్గమ్మ - EDUPAYALA TEMPLE IN MEDAK

ABOUT THE AUTHOR

...view details