ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దివిసీమను ముంచిన వరద- సాయం కోరుతున్న అన్నదాతలు - Farmers Problems Due to Floods

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 11:49 AM IST

Diviseema Farmers Problems Due to Floods : ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం, కృష్ణా నదిలో పెరుగుతున్న వరద దివిసీమను నీట ముంచింది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. పంటలు నీట మునిగాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి పరవళ్లు తొక్కుతూ వస్తున్న కృష్ణా వరద దివిసీమను కునుకులేకుండా చేస్తోంది.

diviseema_flood_threat_looms
diviseema_flood_threat_looms (ETV Bharat)

Diviseema Flood Threat Looms :విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినప్పటికీ దివిసీమలో వరద కొనసాగుతూనే ఉంది. దివిసీమ వరదలు మిగిల్చిన నష్టం అపారమని, ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతి రైతుకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందిజేసి రైతన్నలను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో వివిధ పంటలు నీటమునిగాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోపిదేవి మండలం, బోబర్లంక జలమయమైంది. గ్రామంలో 10 అడుగుల ఎత్తులో వరద ప్రవహిస్తోందని గ్రామస్థలు ఆందోళన చెందుతున్నారు. వరద బాధితులందర్నీ పునరావాస కేంద్రాలకు తరలించారు.

'ఎగువన కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో దివిసీమ కు వచ్చిన వరద నీటి వలన మెట్ట పొలాలు (వాణిజ్య పంటలు) పంట చేతికి రాకముందే నీటిపాలు అయ్యాయి. ఆక్వా రంగం కూడా పూర్తిగా కుదేలయ్యింది. కృష్ణానది పక్కన ఉన్న రొయ్యలు, చేపల , పీతల చెరువులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాలలో వాణిజ్య పంటలైన అరటి, కంద, పసుపు, మొక్కజొన్న తదితర పంటలు వరద నీటిలో మునిగి పూర్తిస్థాయిలో నష్టపోయాం.' - బాధిత రైతులు

'మాకు ఈసారీ వరద ముప్పు తప్పేలా లేదు' - గత అనుభవాలతో బెంబేలెత్తుతున్న దివిసీమ ప్రజలు - Flood Threat in Diviseema

గతంలో ఎన్నడూ చూడనంత నష్టాన్ని చవిచూశామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పొలాల నిండా వరద నీరు చేరి, పెట్టుబడి అంతా బురదపాలు అయ్యిందని కర్షకులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు విధించకుండా పంట నష్టపోయిన ప్రతి రైతుకు పూర్తిస్థాయిలో పరిహారం అందించి తమను ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.

Diviseema Farmers Problems due to Floods :అవనిగడ్డ నియోజకవర్గంలో 10 పునరావాస కేంద్రాలు ఉన్నాయి. మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్ రామ్ రాత్రీ, పగలూ కరకట్టపై వరద పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు. దివిసీమలో సుమారు పది ప్రాంతాంల వరకు కరకట్టపై వరద నీరు రావడంతో ఇసుక బస్తాలు వేసి అధికారులు, స్థానిక యువకులు కరకట్టను కాపాడుకుంటున్నారు.

విజయవాడను ముంచెత్తిన వరద- జలదిగ్బంధంలో జనావాసాలు - Heavy Floods in Vijayawada

ABOUT THE AUTHOR

...view details