ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాధితుల గొంతు వినిపించిన మీడియాపై విశాఖ పోలీసుల తీరు దారుణం: దేవినేని ఉమా - Devineni Uma Fire on Visakha Police - DEVINENI UMA FIRE ON VISAKHA POLICE

Devineni Uma Fire on Visakha Police Filing Case Against Media: తాడేపల్లి ఆదేశాల మేరకు సీఎస్ నేతృత్వంలోనే కుట్ర జరుగుతోందని తెలుగుదేశం సీనియర్‌ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. కంచర్లపాలెం పోలీసుల తీరును దేశమంతా చూస్తోందని తప్పుడు కేసులు పెట్టినవాళ్లు మూల్యం చెల్లించుకోక తప్పదని దేవినేని ఉమ హెచ్చరించారు. బాధితుల గొంతు వినిపించిన మీడియాపై విశాఖ పోలీసులు కేసు పెట్టడంపై సరికాదని మండిపడ్డారు.

devineni_uma
devineni_uma (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2024, 2:10 PM IST

బాధితుల గొంతు వినిపించిన మీడియాపై విశాఖ పోలీసుల తీరు దారుణం: దేవినేని ఉమా (ETV Bharat)

Devineni Uma Fire on Visakha Police Filing Case Against Media:బాధితుల గొంతు వినిపించిన మీడియాపై విశాఖ పోలీసులు కేసు పెట్టడంపై తెలుగుదేశం సీనియర్‌ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. కంచర్లపాలెం పోలీసుల తీరును దేశమంతా చూస్తోందని విమర్శించారు. తప్పుడు కేసులు పెట్టినవాళ్లు మూల్యం చెల్లించుకోక తప్పదని దేవినేని ఉమ హెచ్చరించారు. తాడేపల్లి ఆదేశాల మేరకు సీఎస్ నేతృత్వంలోనే కుట్ర జరుగుతోందన్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్న సీఎస్ వ్యవహారశైలిని ఈసీ కట్టడి చేయాలని కోరారు. విశాఖలో బాధితులు గోడు చెప్పుకుంటే ఆ బాధను ప్రసారం చేసిన ఛానళ్లపైనా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. మీడియా స్వేచ్ఛపైనా దాడి చేసే పరిస్థితికి వచ్చారని అన్నారు.

'అభియోగాలకు సరైన వాదనలు వినిపించాలి' - వైఎస్సార్సీపీ వీర విధేయులకు తప్పని తిప్పలు - Charges Against 3 IPS Officers AP

రాష్ట్రంలో వైఎస్సార్​సీపీ నేతల అరాచకాలను ప్రజలకు తెలియజేయడం తప్పా అని దేవినేని ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారులు, పోలీసులు తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి వచ్చిన ఆదేశాలే పాటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత జరిగిన హింస కావాలనే వైఎస్సార్​సీపీ చేసిన కుట్ర అని మండిపడ్డారు. మహిళలపై దాడి జరిగిన తీరు చూస్తే చాలా బాధేస్తోందని అన్నారు. సీఎం జగన్‌ కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయని తమ పార్టీకి ఓటు వేయలేదనే కక్షతోనే దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఈసీ, సిట్‌ అధికారులు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పుచేసిన పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్‌ చేయాలని సీఎస్‌ జవహర్‌రెడ్డి కూడా బాధ్యత వహించాల్సిందేనని దేవినేని అన్నారు.

బాధితుల గొంతు వినిపించిన మీడియాపై విశాఖ పోలీసులు దాడిచేశారు. కంచర్లపాలెం పోలీసుల తీరును దేశమంతా చూస్తోంది. తప్పుడు కేసులు పెట్టినవాళ్లు మూల్యం చెల్లించుకోక తప్పదు. తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశాలతోనే సీఎస్ నేతృత్వంలో కుట్ర జరుగింది. సజ్జల, జగన్‌ సూచనలతోనే మీడియాపై అక్రమ కేసులు పెట్టారు. ఇలా అక్రమ కేసులు బనాయిస్తున్న సీఎస్ వ్యవహారశైలిని ఈసీ కట్టడి చేయాలి. మీడియాపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే వెనక్కి తీసుకోవాలి. వైసీపీ నేతలను సూటిగా ప్రశ్నిస్తున్నా మీ కాల్ డేటా బహిర్గతం చేయగలరా. ఉన్నతాధికారుల తప్పిదాలకు కిందిస్థాయి ఉద్యోగులు బలయ్యారు.- దేవినేని ఉమ, టీడీపీ సీనియర్‌ నేత

తీవ్ర నిరాశ మిగిల్చిన మామిడి సాగు - ధరలను నియంత్రిస్తూ నిలువు దోపిడీ చేస్తున్న వ్యాపారులు - Mango Farmers problems

అల్లర్లపై సిట్‌ ఆరా - వీడియోలు, ఎఫ్ఐఆర్​లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు - SIT Officials Started Investigation

ABOUT THE AUTHOR

...view details