తెలంగాణ

telangana

రైలు ప్రమాదం - మృతదేహం వద్ద మిన్నంటిన రోదనలు - అంతలోనే ఊహించని వ్యక్తి నుంచి ఫోన్ - Dead Man is Back in Vikarabad

By ETV Bharat Telangana Team

Published : Jun 24, 2024, 10:52 AM IST

Updated : Jun 24, 2024, 11:29 AM IST

Dead Man is Back Incident in Vikarabad : ఓ వ్యక్తి చనిపోయాడనుకొని కుటుంబసభ్యులు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. ఇంతలో వారికి చనిపోయాడనుకునే వ్యక్తి నుంచి ఫోన్​ వచ్చింది. దీంతో అందరూ షాక్​ అయ్యారు. తాను చనిపోలేదని, బతికే ఉన్నానని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఈ ఘటన వికారాబాద్​ జిల్లాలో జరిగింది.

Train Accident in Vikarabad
Dead Man is Back Incident in Vikarabad (ETV Bharat)

Dead Man is Back Incident in Vikarabad: ఓ వ్యక్తి పని కోసం వేరే గ్రామానికి వెళ్లాడు. అక్కడ పరిచయమైన వ్యక్తితో రాత్రి సమయంలో మద్యం సేవించి అక్కడే పడుకున్నాడు. ఇదే అదునుగా తనతో వచ్చిన ఇంకో వ్యక్తి అతని దగ్గర ఫోన్​, డబ్బులు పట్టుకుని వెళ్లిపోయాడు. సీన్​ కట్​ చేస్తే, ఆ ప్రాంతంలో ర్వైల్వే ప్రమాదం. కుటుంబసభ్యులకు ఆ వ్యక్తి చనిపోయడని సమాచారం రావడంతో స్వగ్రామానికి తీసుకువెళ్లి అంత్యక్రియలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈలోపు మరో ట్విస్ట్​. చనిపోయాడనుకున్న వ్యక్తే ఫోన్​ చేశాడు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఇంతకీ చనిపోయిన వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్​ జిల్లానవాంద్గీ గ్రామానికి చెందిన ఎల్లప్పకు భార్య విమలమ్మ, ఇద్దరు కుమారులున్నారు. ఎల్లప్ప బషీరాబాద్‌లో పశువుల కాపరిగా పని చేసేవాడు. అక్కడ రెండు రోజుల క్రితం పని మానేసి తాండూరుకు వెళ్లి సిమెంటు బస్తాలు మోసే హమాలీగా పనిలో చేరాడు. దీంతో అక్కడ ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడగా, వారిద్దరూ కలిసి పని చేస్తున్న గ్రామంలోనే శనివారం సాయంత్రం మద్యం తాగారు. దీంతో ఎల్లప్ప మద్యం మత్తులో ఫుట్​పాత్​పైనే పడుకున్నాడు.

చనిపోయాడని అంత్యక్రియలు- ఇంటికి తిరిగి వచ్చిన వ్యక్తి- అంతా షాక్

Train Accident in Vikarabad: ఎల్లప్పతో పాటు మద్యం తాగిన వ్యక్తి ఆయన దగ్గర ఉన్న డబ్బులు, సెల్‌ఫోన్‌ను తస్కరించి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఆ రోజు రాత్రి వికారాబాద్​ రైల్వే స్టేషన్​లో పట్టాలు దాటుతుండగా ఆ వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదం జరిగిన దగ్గర రైల్వే సిబ్బంది ఆధారాల కోసం వెతకగా, సెల్​ఫోన్​ లభించింది. దీంతో కాల్​డేటా ఆధారంగా చనిపోయిన వ్యక్తి ఎల్లప్పగా భావించి పోలీసులు కుటుంబసభ్యులకు తెలియజేశారు. మృతదేహాం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నందున కుటుంబసభ్యులు ఎల్లప్పగా భావించి అంత్యక్రియలు చేసేందుకు నవాంద్గీకి తీసుకొచ్చారు.

Dead Man is Back at Bashirabad: ఎల్లప్ప చనిపోయాడని గ్రామస్థుల ద్వారా సిమెంట్​ కంపెనీ వారికి తెలిసింది. అయితే అక్కడే పని చేస్తున్న బషీరాబాద్, నవాంద్గీకి చెందిన కొందరు హమాలీలు ఆదివారం ఉదయం ఎల్లప్పను చూశారు. దీంతో అతని వద్దకు వారు వెళ్లి మాట్లాడగా, అసలు విషయం బయటపడింది. అనంతరం ఆయన కుటుంబసభ్యులకు ఫోన్​ చేసి అంత్యక్రియలు నిలిపివేయాలని చెప్పి స్వగ్రామానికి చేరుకున్నాడు. వారు తీసుకొచ్చిన మృతదేహాన్ని రైల్వే సిబ్బందికి అప్పగించారు. మృతదేహం ముక్కలు కావడంతో సరిగ్గా గుర్తుపట్టలేక ఇలా జరిగిందని రైల్వే పోలీసులు వివరించారు.
చనిపోయాడనుకుని డెత్​ సర్టిఫికేట్​.. 33 ఏళ్ల తర్వాత ఇంటికి.. అమ్మవారే వెళ్లమని ఆదేశించారట!

Last Updated : Jun 24, 2024, 11:29 AM IST

ABOUT THE AUTHOR

...view details