ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీ- విజిల్​ ఫిర్యాదుదారుడి వివరాలు బహిర్గతం- ఇద్దరు అధికారులపై వేటు - C Vigil Complaint Disclosure - C VIGIL COMPLAINT DISCLOSURE

Collector suspends Two Authorities C-Vigil Complaint Disclosure: సీ- విజిల్​ యాప్​లోని ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలు బహిర్గతం చేసిన ఇద్దరు అధికారులను ఏలూరు జిల్లా కలెక్టర్​ సస్పెండ్​ చేశారు. ఫిర్యాదు చేసిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచాల్సి ఉన్నా అధికారులు వారి వివరాలను స్క్రీన్ షార్ట్ తీసి వైసీపీ నాయకులకు పంపించినట్లు కలెక్టర్​ విచారణలో తెలిసింది. ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన అధికారులను హెచ్చరించారు.

Collector suspends Two Authorities C-Vigil Complaint Disclosure
Collector suspends Two Authorities C-Vigil Complaint Disclosure

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 22, 2024, 9:45 AM IST

Collector Suspends Two Authorities C-Vigil Complaint Disclosure:సీ- విజిల్​ యాప్​లోని ఫిర్యాదు చేసిన వ్యక్తి గురించి వైసీపీ నాయకులకు సమాచారం ఇచ్చిన ఘటనలో పంచాయతీ కార్యదర్శి తహసీల్దారు కార్యాలయం జూనియర్ అసిస్టెంట్​లపై వేటు పడింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై సీ-విజిల్ యాప్​ ద్వారా ఫిర్యాదు చేసిన వారి వివరాలు బహిర్గతం కావడంపై ఏలూరు కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల చేతికి సీ-విజిల్ ఫిర్యాదు వివరాలు అనే శీర్షికతో ఈనాడులో ప్రచురితమైన వార్తపై కలెక్టర్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ఏలూరు జిల్లా చేబ్రోలు గ్రామ సచివాలయం-1 పంచాయతీ కార్యదర్శి బీవీ రవిచంద్రకుమార్‌, ఉంగుటూరు తహసీల్దార్‌ కార్యాలయం జూనియర్‌ అసిస్టెంట్‌ అమృతలను సస్పెండ్‌ చేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఉంగుటూరు ఎంపీడీవో శర్మకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు.

ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఫిర్యాదు- వెంటనే స్పందించిన అధికారులు

C-vigil Complaint Details to YCP Leaders: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమాడు పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురంలో గ్రంథాలయం, వాటర్ ప్లాంటుకు వైసీపీ రంగులు ఉండటంతో స్థానికుడు ఫొటోలు తీసి సీ-విజిల్ యాప్​ ద్వారా ఈ నెల 19న ఫిర్యాదు చేశారు. ఈ ఫొటోలో ఫిర్యాదు చేసిన వ్యక్తితోపాటు ఆయన స్నేహితుడు కూడా ఉన్నారు. అధికారులు గంటలోపే స్పందించి వాటికి తెల్లరంగు వేయించారు. ఫిర్యాదు చేసిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచాల్సి ఉన్నా అధికారుల వారి వివరాలను ల్యాప్ టాప్​లో స్క్రీన్ షార్ట్ తీసి దాన్ని వైసీపీ నాయకులకు పంపించారు. దీంతో ఫిర్యాదుదారుడి స్నేహితుడి సోదరుడికి వైసీపీ నాయకులు ఫోన్​ చేసి ప్రశ్నించారు. ఈ విషయం అతనికి తెలియడంతో సీ-విజిల్ యాప్​లో ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పందించి విచారణ చేపట్టారు. సీ- విజిల్ యాప్​లోని ఫిర్యాదు చేసిన వ్యక్తి విషయాలు బహిర్గతం కావటంలో బాధ్యులైన బొడ్డు రవిచంద్ర కుమార్, తహసీల్దారు కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ అమృతలను కలెక్టర్ సస్పెండ్ చేశారు.

ఎన్నికల ప్రజాస్వామ్యంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి: హరేంథిర ప్రసాద్

కలెక్టర్‌ విచారణలో తెలిసిన వివరాల ప్రకారం సంబంధిత పంచాయతీ కార్యదర్శి సీ-విజిల్‌ దాఖలైన ఫిర్యాదు స్క్రీన్‌ షాట్‌ను ఎంసీసీ నోడల్‌ అధికారి అయిన ఎంపీడీవోకు పంపారు. ఆ స్క్రీన్‌ షాట్‌ను ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శుల వాట్సప్‌ గ్రూప్‌లో పోస్టు చేశారు. అదే స్క్రీన్‌ షాట్‌ను చేబ్రోలు పంచాయతీ కార్యదర్శి ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తికి చేర వేశారు. దీంతో వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.

అధికారి నిర్వాకం - వైసీపీ నాయకుల చేతికి సీ-విజిల్‌ ఫిర్యాదు వివరాలు

ABOUT THE AUTHOR

...view details