Chandrababu Review Three Departments Today : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గనులు, ఎక్సైజ్, పరిశ్రమల శాఖలపై కీలక సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత పరిశ్రమల శాఖపై సీఎం సమీక్షిస్తున్నారు. ఈ సమీక్షలో మంత్రులు భరత్, కొండపల్లి శ్రీనివాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిశ్రమల శాఖలో గత ఐదేళ్లుగా జరిగిన వ్యవహారాలపై చంద్రబాబు అధికారులతో చర్చిస్తున్నారు.
Chandrababu Review Industries Department : టీడీపీ హయాంలో వచ్చిన పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లారని అధికారులు చంద్రబాబుకు వివరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సహకరించకపోవడంతో ఇలా జరిగిందని తెలిపారు. భూములు కేటాయించిన తర్వాత కూడా వెనక్కి వెళ్లిపోయారని చెప్పారు. పరిశ్రమలకు కేటాయించిన భూములు కూడా దుర్వినియోగం అయ్యాయని వారు ముఖ్యమంత్రికి వెల్లడించారు. ఈ క్రమంలోనే కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నించాలని చంద్రబాబు అన్నారు. పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కల్పించేందుకు తానే మాట్లాడతానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాల్లో భూముల లభ్యత, పారిశ్రామిక అనుకూల ప్రాంతాలపై చర్చలు జరుపుతున్నారు.