CM Chandrababu Press Meet With AI Technology: అత్యాధునిక టెక్నాలజీ వినియోగంలో చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఉంటారు. మోడర్న్ టెక్నాలజీని వినియోగించడంలో ముందుండే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో వినూత్నం ప్రయోగం చేశారు.
దావోస్ పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. అయితే మామూలుగా ప్రెస్మీట్ అంటే విలేకరులు, కెమెరామెన్లతో గందరగోళంగా ఉంటుంది. అందుకే సీఎం చంద్రబాబు వినూత్న ఆలోచనకు తెరతీశారు. వినూత్నంగా కేవలం విలేకరులతో మాత్రమే ప్రెస్మీట్ నిర్వహించారు. మరి కెమెరామెన్లు ఎక్కడ అనేదేగా మీ ప్రశ్న. అయితే అవేం అవసరం లేకుండా ఏఐతోనే ఈ సమావేశం పూర్తి చేశారు.
ఏఐతో పనిచేసే సిస్టమ్: వీడియోగ్రాఫర్లు, కెమెరామెన్లు లేకుండా పూర్తిగా ఏఐతో పనిచేసే సిస్టమ్ను వినియోగించారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో 4 కెమెరాలతో మల్టీవీడియో కెమెరా సిస్టమ్ ఏర్పాటు చేశారు. దీనిద్వారానే అక్కడ నుంచి లైవ్ కవరేజీ అందించారు. సమావేశం జరిగే హాల్లోకి చంద్రబాబు వచ్చిన సమయంలో ఒక కెమెరాకు సూచనలు ఇవ్వడం ద్వారా ఆయన్ను సెంటర్గా చేసుకుంటూ అదే వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసింది.