ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీలో మద్యం నాణ్యతపై ఆరా! - రాష్ట్ర వ్యాప్తంగా డిస్టిలరీల్లో సీఐడీ తనిఖీలు

రాష్ట్ర వ్యాప్తంగా మద్యం తయారీ డిస్టిలరీల్లో సీఐడీ విస్తృత తనిఖీలు - బెవరేజెస్ కంపెనీల్లో దస్త్రాలు పరిశీలిస్తున్న అధికారులు

CID Inspections at Distilleries in AP
CID Inspections at Distilleries in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

CID Inspections at Distilleries in AP :రాష్ట్రంలోని మద్యం తయారీ డిస్టిలరీలు, బెవరేజెస్‌ కంపెనీల్లో సీఐడీ అధికారులు విస్తృతంగా ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. దస్త్రాలను పరిశీలిస్తున్నారు. బాట్లింగ్ యూనిట్లలో ఉత్పత్తుల నిల్వ సహా తదితర వివరాలు అధికారులు సేకరిస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లా :ఎన్టీఆర్ జిల్లా నందిగామ, కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామంలోని సెంటనీ బయోటెక్ కర్మాగారంలో ఏపీ సీఐడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కర్మాగారంలోని మద్యం తయారీ బాటిలింగ్ యూనిట్​లో అధికారులు తనిఖీలు చేపట్టారు. సీఐడీ అధికారుల ఆదేశాల మేరకు కంచికచర్ల ఎక్సైజ్ అధికారులు కర్మాగారం లోపలికి వెళ్లారు. కర్మాగారంలోకి ఎవరిని అనుమతి ప్రధాన గేటు వద్దనే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. సీఐడీ అధికారులు బాటిలింగ్ యూనిట్​లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. గంపలగూడెం మండలం చింతలనర్వ వద్ద ఉన్న శార్వాణి మద్యం తయారీ కంపెనీలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

వైఎస్సార్ జిల్లా : కడప శివారులోని ఈగల్ డిస్టలరీలో సీఐడీ ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా సోదాలు చేస్తున్నారు. సోదాల్లో భాగంగా గత ఏడాది నుంచి ఎంత మద్యం తయారు చేశారు. ఎన్ని వేల లీటర్ల మద్యాన్ని విక్రయించారని వివరాలన్నింటిని సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. మద్యం తయారీలో నిబంధనల మేరకు నాణ్యత పాటిస్తున్నారా లేదా అని పరిశీలిస్తున్నారు. ఐదుగురు సీఐడీ అధికారులు వచ్చి దస్త్రాలను పరిశీలిస్తున్నారు. వీటితో పాటు మరిన్ని వివరాలను సీఐడీ అధికారులు రాబడుతున్నారు. సిబ్బంది ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. సీఐడీ సోదాలు ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

"లైసెన్సులు మాకిచ్చి పోండి - ప్రతి నెలా ముడుపులివ్వాల్సిందే"- మద్యం వ్యాపారులకు ఎమ్మెల్యేల బెదిరింపులు

ఏలూరు జిల్లా :ఏలూరు జిల్లా ఉంగుటూరు, పెదవేగి మండలాల్లోని పలు మద్యం డిస్టిలరీల్లో సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉంగుటూరు మండలం చెబ్రోలులోని సోరింగ్ స్పిరిట్స్, పెదవేగి మండలం వంగూరులోని గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్​కి చెందిన డిస్టిలరిల్లో ఉదయం నుంచి అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. రాజమహేంద్రవరం సీఐడీ అదనపు ఎస్పీ ఆస్మాన్ ఫరహీన్ ఆధ్వర్యంలో తనిఖీలు సాగుతుండగా వైఎస్సార్సీపీ హయాంలో డిస్టిలరీల్లో జరిగిన అవకతవకలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

కృష్ణా జిల్లా : కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలోని గొడవర్రు, దావులూరు గ్రామాల్లోని లిక్కర్ బేవరేజెస్ ఫ్యాక్టరీల్లో సీఐడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. గొడవర్రు బివీఎస్ డిస్టిలరీ, దావులూరు పరిధిలోని బీఆర్కే స్పిరిట్స్ ఫ్యాక్టరీల్లో అధికారుల బృందాలుగా ఏర్పడి రికార్డును పరిశీలిస్తున్నారు.

మందుబాబుల ఆరోగ్యానికి గ్యారెంటీ! - జే బ్రాండ్‌కు బై బై - ఇక ప్రైవేటు మద్యం అమ్మకాలు - New Liquor Policy 2024 in AP

నంద్యాల జిల్లా : నంద్యాల ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ సమీపంలో మద్యం తయారీ పరిశ్రమ బాటిలింగ్ యూనిట్​లో సీఐడీ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. పరిశ్రమలో దస్త్రాలు పరిశీలించారు. నిల్వ వివరాలు సేకరించారు. ఉత్పత్తుల నిల్వ వివరాలను సేకరించి పనిలో సీఐడీ బృందం నిమగ్నం అయింది.

తూర్పుగోదావరి జిల్లా :తూర్పుగోదావరి జిల్లాలో మద్యం తయారీ కేంద్రాల్లో సీఐడీ తనిఖీలు చేపట్టింది. అనపర్తి మండలం కొప్పవరం బీడీహెచ్ ఆగ్రో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ లిక్కర్ పరిశ్రమలో ఉదయం నుంచి సీఐడీ అధికారులు సోదాలు చేపట్టారు. సీఐడీ డీఎస్పీ నాగేంద్ర భోపాల్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది సీఐడీ సిబ్బంది కలిసి రికార్డులను తనిఖీ చేశారు. కొప్పవరంలో గత ఏడేళ్లుగా 1.2 లక్షల బాటిళ్ల సామర్థ్యంతో పరిశ్రమ నడుస్తోంది. రంగంపేట మండలం కోటపాడు లోని పీఎంకే డిస్టిలరీ పరిశ్రమంలోనూ సీఐడీ సోదాలు చేపట్టారు. రంగంపేట మండలం నల్లమిల్లిలోనూ ఫ్రాగ్ మద్యం తయారీ పరిశ్రమలో సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి.

తక్కువ ధరకు అన్ని బ్రాండ్లు అందుబాటులోకి ​ - త్వరలో నూతన మద్యం పాలసీ! - ap liquor policy 2024

ABOUT THE AUTHOR

...view details