తెలంగాణ

telangana

ETV Bharat / state

ఔరా రామా!! - బియ్యపు గింజలతో అయోధ్య మందిరం - Ayodhya Ram Mandir With Rice Grains

Ayodhya Ram Mandir With Rice Grains : ఆయన రూపొందించిన సూక్ష్మ కళాఖండాలను చూస్తే ఎవరైనా ఔరా అనిపించాల్సిందే. గుండుపిన్నుపై ఎన్నో కళాఖండాలు చెక్కిన ఆ కళాకారుడు ఇప్పుడు 16,000ల బియ్యపు గింజలతో అయోధ్య రామమందిర ఆకృతిని రూపొందించి భళా అనిపించుకున్నారు. అతనే జగిత్యాల జిల్లాకు చెందిన గుర్రం దయాకర్.

Ayodhya Ram Mandir
Ayodhya Ram Mandir

By ETV Bharat Telangana Team

Published : Jan 22, 2024, 2:11 PM IST

బియ్యపు గింజలతో రామమందిర ఆకృతి నిర్మాణం

Ayodhya Ram Mandir With Rice Grains : ఆయనో ఔత్సాహిక కళాకారుడు. సూక్ష్మకళలో తనదైన శైలిలో రాణిస్తున్నారు. నమ్ముకున్న కళ అతనికి పేరు తెచ్చింది. ప్రతిభ ఆయనకు బహమతులతో పాటు అవార్డులను మోసుకొచ్చింది. జగిత్యాల పట్టణంలోని తులసినగర్‌కు చెందిన గుర్రం దయాకర్‌కు (Micro artist Gurram Dayakar)చిన్నతనం నుంచే సూక్ష్మ కళలలంటే మక్కువ. దుబాయ్ వెళ్లి వచ్చిన తర్వాత గత ఆరేళ్లుగా ఈ కళపై మరింత దృష్టి సారించారు. ఇప్పటికే అనేక కళాఖండాలను రూపొందించారు.

Rice Grains Ayodhya Ram Mandir :గుండుపిన్నులపై శివలింగం, ఈఫిల్‌టవర్‌, త్రికూట ఆలయాన్ని చెక్కారు. అలాగే సూది బెజ్జంలో రైతు నాగలి పట్టుకున్నట్లు ఇలా అనేక సూక్ష్మ కళాఖండాలను తీర్చిదాద్దారు. బంగారపు బియ్యపు గింజ మధ్యలో మువ్వన్నెల జెండాను రూపొందించారు. ఆవగింజ పరిమాణంలో బంగారంతో బొజ్జ గణపయ్యను తయారు చేసి ఔరా అనిపించారు. ఆకులపై ప్రముఖుల ముఖ చిత్రాల్ని ఆవిష్కరించారు. అలాగే అతి చిన్నసైజులో ఎలుకల బోను నమూనాను సృష్టించారు. ఇందుకుగాను గిన్నిస్‌ రికార్డు వరించింది. ఇలా ఎన్నో కళాఖండాలకు జీవం పోసిన తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు.

ఇనుము వాడకుండా రామాలయ నిర్మాణం- ఫస్ట్ ఫ్లోర్​లో శ్రీరామ దర్బార్- ఆలయ ప్రత్యేకతలివే

Ayodhya Ram Mandir Opening 2024 : తాజాగా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని తాను ఒకింత ప్రత్యేకంగా నిలవాలనుకున్నారు. ఉడతా భక్తిగా తన కళనే రాముడికి నివేదించాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ప్రయత్నం మొదలుపెట్టి విజయవంతంగా పూర్తి చేశారు. బియ్యపు గింజలతో రామమందిరం (Ayodhya Ram Mandir) ఆకృతిని రూపొందించారు. దాదాపు 16,000ల బియ్యం గింజలతో 60 గంటలపాటు శ్రమించి తయారు చేసినట్లు గుర్రం దయాకర్ తెలిపారు.

"నాకు చిన్నప్పటి నుంచి సూక్ష్మ కళల పట్ల ఆసక్తి ఎక్కువ. మా పెద్దనాన్న సూక్ష్మ కళాఖండాలను తయారు చేసేవారు. ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లాను. అక్కడ కూడా పెయిటింగ్, సూక్ష్మ కళా ఖండాలను రూపొందించాను. అనంతరం జగిత్యాలకు వచ్చి ఇంజినీరింగ్ వర్క్ షాప్ పెట్టాను. అందులో పనిచేస్తూనే ఖాళీ సమయాల్లో కళా ఖండాలను తయారు చేస్తున్నాను. ఈ విధంగా బియ్యపు గింజలతో అయోధ్య రామమందిర ఆకృతిని రూపొందించాను. ఇది నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది." - గుర్రం దయాకర్, సూక్ష్మ కళాకారుడు, జగిత్యాల జిల్లా

ఇనుము వాడకుండా రామాలయ నిర్మాణం- ఫస్ట్ ఫ్లోర్​లో శ్రీరామ దర్బార్- ఆలయ ప్రత్యేకతలివే

భారతీయుల కల నేరవేరిన వేళా సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పాలనే రామమందిర ఆకృతిని రూపొందించానని గుర్రం దయాకర్ పేర్కొన్నారు. దీనిని తయారు చేయడం తనకు ఎంతో సంతృప్తి, ఆనందాన్ని ఇచ్చిందని వివరించారు. చిత్రలేఖనం, హస్తకళ, సూక్ష్మకళలో తాను రూపొందించిన కళాఖండాలు ఎన్నో బహుమతులు గెలుచుకున్నాయని చెప్పారు. వివిధ సంస్థలు బహుమతులు, పురస్కారాలతో సత్కరించాయని గుర్రం దయాకర్ వెల్లడించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తయారు చేసిన రామమందిరం నిర్మాణం చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా గుర్రం దయాకర్‌కు పలువురు శుభాకాంక్షలు చెప్పారు. ఆయన ఇలాంటి మరిన్ని కళాఖండాలను రూపొందించాలని వారు ఆకాక్షించారు.

రామమందిరంతోపాటు అయోధ్యలో ముఖ్య ఆలయాలివే- తప్పక దర్శించుకోండి!

హైదరాబాద్​ నుంచి బంగారు పాదుకలు, ఛత్తీస్‌గఢ్‌ నుంచి 3లక్షల కిలోల బియ్యం- రాఘవుడికి ఎన్నో కానుకలు

ABOUT THE AUTHOR

...view details