ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విదేశీ అతిథుల 'థింసా' డ్యాన్స్ - అరకు చలి ఉత్సవాలు ధూమ్ ధామ్ - DHIMSA DANCE AT VISHAKHA HOTELS

అరకు చలి ఉత్సవాల్ని అతిథిలకు తెలియజెప్పేవిధంగా కళాకారుల ప్రదర్శనలు - థింసా నృత్యానికి పాదం కలిపిన దేశ విదేశాల అతిథులు

Dhimsa Dance at Vishakha Hotels
Dhimsa Dance at Vishakha Hotels (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 1, 2025, 7:52 PM IST

Dhimsa Dance at Vishakha Hotels : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో జరుగుతున్న చలి ఉత్సవాన్ని అతిథిలకు తెలియజెప్పేవిధంగా విశాఖపట్నం స్టార్ హోటళ్ల వద్ద కళాకారులు ప్రదర్శనలు చేేస్తున్నారు. అల్లూరి జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి మేరకు కళాకారులను విశాఖలోని హోటళ్ల వద్ద అతిథులను పలకరించేందుకు అనుమతించారు. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులకు, స్ధానికంగా వచ్చే అతిథులను వీరు గిరిజన సంప్రదాయ రీతిలో ఆహ్వానం పలుకుతున్నారు. థింసా నృత్యం వారికి పరిచయం చేసి, వారు కూడా ఈ నృత్యంలో భాగంగా పాదం కలిపేట్టుగా కళాకారులు ఉత్సాహపరుస్తున్నారు.

విభిన్న గిరిజన సంస్కృతులు : ఆంధ్ర ఊటీ అరకులోయలో చలి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజులపాటు నిర్వహిస్తున్న అరకు ఉత్సవాలు ఫిబ్రవర్ 2వ తేదీ ఆదివారంతో ముగియనున్నాయి. పర్యాటకులు, స్థానికులు కేరింతల కొడుతూ ఉత్సవాలను ఆస్వాదిస్తున్నారు. ఉత్సవాల నిర్వహణకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్​తో పాటు అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఏడు రాష్ట్రాలకు చెందిన విభిన్న గిరిజన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఉత్సవాలకు వచ్చిన ఆహుతులను అలరిస్తున్నాయి.

తరలివస్తున్న పర్యాటకులు : అరకులో అట్టహాసంగా నిర్వహిస్తున్న చలి ఉత్సవాల్లో పర్యాటకులు సందడి చేస్తున్నారు. ఈ ఉత్సవాల కోసం అనేక ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో తరలివస్తున్న పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హెలికాప్టర్ రైడింగ్, ఫైర్ బెలూన్, ఫ్లవర్ షో తో పాటు గిరిజన నృత్య కళా ప్రదర్శనలు పర్యాటకులను అలరిస్తున్నాయి. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలను కళాకృతుల రూపంలో కళ్లకు కట్టే ట్రైబల్ మ్యూజియం సందర్శనకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.

ఆకట్టుకున్న గిరిజనులు కళలు :అరకు చలి ఉత్సవాల సందర్భంగా స్థానిక గిరిజనులు తయారుచేసిన కళాకృతులు, ఆహార ఉత్పత్తులు, గృహాలంకరణ వస్తువులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల ద్వారా వీటిని ప్రదర్శిస్తున్నారు. గిరిజనుల స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు చలి ఉత్సవాలు దోహదపడతాయని అధికారులు చెబుతున్నారు.

ఏడు రాష్ట్రాలకు గిరిజన కళాకారులు : అరకు చలి ఉత్సవాల్లో భాగంగా బొర్రా గుహల నుంచి అరకు లోయ వరకు సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. సాయంత్రం స్థానిక ప్రభుత్వ కళాశాల మైదానంలో గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వీటిలో 7 రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారులు పాల్గొన్నారు.

ఘనంగా అరకు చలి ఉత్సవాలు - పాల్గొన్న 7 రాష్ట్రాల కళాకారులు

అరకులో ప్రారంభమైన వింటర్​ ఫెస్ట్​ - ప్రత్యేక ఆకర్షణగా పారా గ్లైడింగ్‌

ABOUT THE AUTHOR

...view details