ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రూప్​-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్‌ పరీక్షల తేదీలు రిలీజ్ - APPSC GROUP 1 MAINS EXAM DATES

మే 3 నుంచి 9 వరకు గ్రూప్​-1 మెయిన్స్‌ పరీక్షలు - డిస్క్రిప్టివ్ టైప్‌లో పరీక్షలు

APPSC Group 1 Mains Exam Dates
APPSC Group 1 Mains Exam Dates (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 21, 2025, 5:24 PM IST

Updated : Jan 21, 2025, 7:28 PM IST

APPSC Group-1 Mains Exam Dates 2025 :రాష్ట్రంలో గ్రూప్​-1 ఉద్యోగాల నియమాకం కోసం మెయిన్స్ పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రిలిమ్స్​లో అర్హత సాధించిన వారిలో 1:50 చొప్పున అభ్యర్థులను మెయిన్స్​కి ఎంపిక చేసింది. ఈ పరీక్షలు రాసేందుకు 4496 మంది అభ్యర్థులు అర్హత పొందినట్లు వెల్లడించింది.

2023 డిసెంబర్​లో 89 గ్రూప్​-1 ఉద్యోగాల నియామకానికి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. అయితే వైఎస్సార్సీపీ సర్కార్ ఎన్నికల సమయంలో హడావుడిగా ప్రిలిమ్స్ నిర్వహించడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, మెయిన్స్ పరీక్ష రాసేందుకు తగిన గడువును ఇవ్వాలని కమిషన్​ని పలువురు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు.

APPSC Group-1 Mains :ఈ క్రమంలోనే అభ్యర్థులు మెయిన్స్​కి సన్నద్దమయ్యేందుకు వీలుగా మరింత గడువు ఇవ్వాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం, విజయవాడ , తిరుపతి, అమలాపురంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ పరీక్షలను డిస్క్రిప్టివ్ టైప్​లో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఇంఛార్జ్​ కార్యదర్శి ఐ . నరసింహమూర్తి తెలిపారు. మెయిన్స్ ప్రశ్నాపత్రాన్ని ట్యాబ్​లలో పొందుపరచి ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఏపీ యువతకు గుడ్​న్యూస్ -ఈ ఉద్యోగాలకు పరీక్షా తేదీలు ప్రకటించిన APPSC

Last Updated : Jan 21, 2025, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details