ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By Andhra Pradesh Live News Desk

Published : 5 hours ago

Updated : 10 minutes ago

ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 24 September 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Tue Sep 24 2024- రాజమహేంద్రవరంలో బుల్డోజర్లు - 21 ప్రాంతాల్లో 128 అక్రమ కట్టడాలే టార్లెట్ - Encroachments in Rajamahendravaram

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

12:33 PM, 24 Sep 2024 (IST)

రాజమహేంద్రవరంలో బుల్డోజర్లు - 21 ప్రాంతాల్లో 128 అక్రమ కట్టడాలే టార్లెట్ - Encroachments in Rajamahendravaram

Encroachments in Rajamahendravaram : వైఎస్సార్సీపీ పాలనలో రాజమహేంద్రవరంలో అడుగడుగునా కబ్జాల పర్వం కొనసాగింది. అధికారులను తమ గుప్పిట్లో ఉంచుకొని నేతలు ఆడిందే ఆటగా పాడిందే పాటగా డబ్బులు దండుకున్నారు. తాజాగా అధికారులు వీటిపై ఫోకస్ పెట్టారు. నెలరోజుల్లో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు కార్యాచరణ చేపట్టారు. | Read More

ETV Bharat Live Updates

12:31 PM, 24 Sep 2024 (IST)

ప్రత్యర్థులకు సాయం చేశాడని పట్టపగలు హత్యాయత్నం - అనంతపురం జిల్లాలో దారుణం - Opponents Attack Family in Guntakal

Opponents Attack on Family in Guntakal : గుంతకల్లులో పట్టపగలే ఓ కుటుంబంపై ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. | Read More

ETV Bharat Live Updates

12:28 PM, 24 Sep 2024 (IST)

ఏడుగురు మిత్రులను సన్మానించిన వెంకయ్య నాయుడు- అదిరిపోయే ఫ్లాష్​ బ్యాక్​ - Venkaiah Naidu Honors Seven Friends

Venkaiah Naidu Honors Seven Friends in Visakha : ఎటువంటి హద్దులు లేని స్నేహం జీవితాంతం గుర్తు ఉంటుంది. అలాంటి స్నేహితులు 70 ఏళ్లు దాటిన అనంతరం ఓ చోట కలుసుకున్న అపూర్వ ఘటం విశాఖలో జరిగింది. తన ఏడుగురు మిత్రులకు 70 ఏళ్లు నిండిన సందర్భంగా మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సత్కారం చేశారు. | Read More

ETV Bharat Live Updates

12:24 PM, 24 Sep 2024 (IST)

ఈఫిల్​ టవర్​ తరహాలో ‘ఒబిలిస్క్‌ టవర్‌’- యానాంలో పడకేసిన పర్యాటక ప్రాజెక్టు - Yanam Obelisk Tower

Government Neglect Yanam Obelisk Tower : ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్​ టవర్​ నమూనాతో నిర్మించిన ‘యానాం ఒబిలిస్క్‌ టవర్‌’ సరైన నిర్వహణ, ప్రణాళిక లేక పడకేసింది. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఈ టవర్​ వద్దకు సరైన రవాణా సదుపాయాలు లేకపోవడంతో పర్యాటకులు ఆసక్తి చూపించడంలేదు. | Read More

ETV Bharat Live Updates

11:37 AM, 24 Sep 2024 (IST)

పోస్టింగులు, రాజకీయ ప్రాపకం కోసం - ముంబై నటిపై ఫోర్జరీ పత్రంతో కేసు - Mumbai Actress Case

IPS Officers Anarchy In Mumbai Actress Case: శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్‌ ఉన్నతాధికారులే వైఎస్సార్సీపీ పాలనలో రాజకీయ ప్రాపకం కోసం దారితప్పారు. పోస్టింగ్‌ల కోసం తప్పుడు సాక్ష్యాలు, ఫోర్జరీ పత్రంతో ఓ మహిళపై అన్యాయంగా కేసు బనాయించారు. వైఎస్సార్సీపీ నేత విద్యాసాగర్‌తో కుమ్మక్కై కుట్రకు పాల్పడ్డారు. నకిలీ ధ్రువపత్రాలను అసలు రికార్డులుగా న్యాయస్థానాన్నీ నమ్మించారు. కుట్రలో ఐదుగురు పోలీస్‌ అధికారులు సూత్రధారులుగా విద్యాసాగర్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో విచారణ అధికారులు వెల్లడించారు. | Read More

ETV Bharat Live Updates

10:06 AM, 24 Sep 2024 (IST)

సనాతన ధర్మం జోలికొస్తే ఖబడ్దార్ : పవన్ కల్యాణ్ - Pawan Kalyan Visits Indrakeeladri

Pawan Kalyan Prayaschitta Diksha: తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో మెట్లను పవన్‌ కల్యాణ్‌ శుభ్రం చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసేవారని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. | Read More

ETV Bharat Live Updates

09:58 AM, 24 Sep 2024 (IST)

ప్రతి ఒక్క అర్హుడికి పింఛన్‌ అందాలి - విశాఖలో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం - Chandrababu Review on Pensions

Chandrababu Review on Pensions : రాష్ట్రంలోని అర్హులందరికీ పింఛన్‌ అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అదే సమయంలో అనర్హులు స్వచ్ఛందంగా పెన్షన్లు వదులుకోవాలని పిలుపునిచ్చారు. తప్పుడు ధ్రువపత్రాలతో కొంతమంది దివ్యాంగుల కోటాలో పింఛన్లు పొందడం సరికాదన్నారు. ఇది వారికి అన్యాయం చేయడమేనని చెప్పారు. ఇలాంటి వాటిని గుర్తించి అనర్హులని ఏరివేసి, అర్హులకే పింఛన్‌ ఇచ్చేలా గ్రామ సభల్లో కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. విశాఖలో 30 ఎకరాల్లో రూ.200 కోట్లతో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. | Read More

ETV Bharat Live Updates

09:59 AM, 24 Sep 2024 (IST)

ఏపీలో ఏఐ, క్రీడా విశ్వవిద్యాలయాలు - 2027 నాటికి వర్సిటీలు మెరుగైన ర్యాంకులు - Lokesh Review On Education

Minister Nara Lokesh Review On Education Officials : రాష్ట్రంలో ఏఐ విశ్వవిద్యాలయంతో పాటు క్రీడా విశ్వవిద్యాలయ ఏర్పాటుకు కార్యచరణ సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి లోకేశ్​ సూచించారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా వీటి ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. | Read More

ETV Bharat Live Updates

09:13 AM, 24 Sep 2024 (IST)

తిరుమల లడ్డూ వివాదంపై సిట్​ - నేడు అధికారిక ఉత్తర్వులు? - SIT on Tirumala Laddu Controversy

SIT To Investigate Tirumala Laddu Controversy?: తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిట్‌ ఏర్పాటు దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు, నిఘావిభాగాధిపతి మహేష్‌ చంద్ర లడ్హాలతో సీఎం చర్చించినట్లు సమాచారం. | Read More

ETV Bharat Live Updates

08:40 AM, 24 Sep 2024 (IST)

వైఎస్సార్సీపీ సర్పంచ్​ భర్త నిర్వాకం - అధికారం అండతో అడ్డగోలుగా దోపిడీ - YSRCP Sarpanch Husband extortion

YSRCP Sarpanch Husband People Misappropriation of Funds in Eluru District : గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు సాగించిన నిధుల దుర్వినియోగం ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఏలూరు జిల్లా ఓ పంచాయతీలో ప్రభుత్వ అధికారిని అడ్డం పెట్టుకుని సర్పంచ్‌ భర్త దోచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ఓ సామాజిక కార్యకర్త ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కి ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. | Read More

ETV Bharat Live Updates

07:22 AM, 24 Sep 2024 (IST)

ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టుకు వైఎస్సార్సీపీ బ్రేక్‌ -ఎన్డీఏ ప్రభుత్వంపైనే అన్నదాతల కోటి ఆశలు - YSRCP Govt on Offshore Project

YSRCP Government Careless on Offshore Project: వైఎస్సార్సీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టుల్లో ఆఫ్‌షోర్‌ కూడా ఒకటి. శ్రీకాకుళం జిల్లాలో వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు తలపెట్టిన ఈ ప్రాజెక్టుని గత ప్రభుత్వం అటకెక్కించింది. ప్రాజెక్టు వస్తే తలరాతలు మారతాయని ఎదురుచూసిన రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. మరోవైపు పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల్లేక నిర్వాసితులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కూటమి ప్రభుత్వమే ఆఫ్‌షోర్‌ బాధ్యతని తీసుకోవాలని రైతులు, నిర్వాసితులు కోరుతున్నారు. | Read More

ETV Bharat Live Updates

07:18 AM, 24 Sep 2024 (IST)

భవానీ ద్వీపానికి వరద దెబ్బ - కళావిహీనంగా మారిన పరిసరాలు - Bhavani Island Damaged in Floods

Bhavani Island Damaged in Floods : ఎటు చూసినా కనుచూపు మేర కృష్ణమ్మ ప్రవాహం. చల్లని చూపుతో లోకాలను పాలించే దుర్గమ్మ ఓ వైపు. కృష్ణవేణికి వడ్డానంలా కనిపించే ప్రకాశం బ్యారేజీ మరోవైపు. నదీ గర్భంలో 600 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో సహజ సిద్ధంగా నిర్మితమైన అత్యద్భుత ప్రదేశమే భవానీ ద్వీపం. ఒకప్పుడు పర్యాటకులతో కళకళలాడుతూ ఉండే ఈ ప్రదేశమంతా ఇప్పుడు వరదల వల్ల కళావిహీనంగా మారింది. ఇప్పటివరకు ఈ ప్రాంతాన్ని చూసి వావ్‌ అన్నవారే ఇప్పుడు అయ్యో అనే స్థితికి చేరింది. | Read More

ETV Bharat Live Updates
Last Updated : 10 minutes ago

ABOUT THE AUTHOR

...view details