ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 21 September 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Sat Sep 21 2024- విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో మరోసారి కూల్చివేతలు - Vijayasai Daughter Place issue

By Andhra Pradesh Live News Desk

Published : 4 hours ago

Updated : 27 minutes ago

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

11:51 AM, 21 Sep 2024 (IST)

విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో మరోసారి కూల్చివేతలు - Vijayasai Daughter Place issue

Demolition of Vijayasai Reddy Daughter Illegal Constructions in Bheemili : వైఎస్సార్సీపీ హయాంలో అధికారం అండతో ఆ పార్టీ నేతలు, సహా వారి బంధువులు పలు అక్రమాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ భూమిలు, చెరువులు దోచుకున్నారు, వందల ఎకరాల భూకబ్జాలు చేశారు. ఈ నేపథ్యం విజయసాయి రెడ్డి కుమార్తెకు సంబంధించిన అక్రమ నిర్మాణాన్ని జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates

11:20 AM, 21 Sep 2024 (IST)

కోళ్ల వ్యర్థాల్లోనూ కోట్లు ఆర్జించారు - నేతల మధ్య సెటిల్‌మెంట్‌ చేసిన కీలక నాయకుడు - YSRCP Chicken Waste Irregularities

YSRCP Corporators Poultry Waste Scam : గత ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు చేసిన అక్రమాలు అన్ని ఇన్ని కావు. ధనార్జన కోసం అడ్డదారులు తొక్కారు. ఈ క్రమంలోనే జీవీఎంసీలో కోళ్ల వ్యర్థాల తరలింపులో వైఎస్సార్సీపీ నేతలు బరితెగించారు. వాటిని అక్రమంగా రవాణా చేసి ఇతర జిల్లాల్లో చేపల చెరువులకు తరలించి కోట్లు ఆర్జించారు. | Read More

ETV Bharat Live Updates

10:58 AM, 21 Sep 2024 (IST)

కస్టడీలో నిందితులకు హాని జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదే : హైకోర్టు - HC on Raghurama Krishna Raju Case

HC on Raghurama Krishna Raju Case in AP: కస్టడీలో నిందితులకు హాని జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. నిందితులకు ఏమైనా జరిగితే ఆ కేసు దర్యాప్తు అధికారి వివరణ ఇవ్వాల్సిందేనని సృష్టం చేసింది. మాజీ ఎంపీ, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజును చిత్రహింసలకు గురిచేసిన సందర్భంలో కేసు ఐఓగా విజయ్​పాల్​ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన హైకోర్టుకు వివరణ ఇవ్వాల్సిన అవసరముందని తేల్చి చెప్పింది. | Read More

ETV Bharat Live Updates

10:27 AM, 21 Sep 2024 (IST)

ఎన్‌ఐటీ పట్నాలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య - ఓ సూసైడ్‌ నోట్‌ లభ్యం - AP Student Suicide in NIT Patna

AP Student Suicide in NIT Patna : ఎన్​ఐటీ పట్నాలో ఆంధ్రప్రదేశ్​కు చెందిన పల్లవిరెడ్డి అనే విద్యార్థిని మృతి చెందింది. శుక్రవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. | Read More

ETV Bharat Live Updates

09:52 AM, 21 Sep 2024 (IST)

రాష్ట్రవ్యాప్తంగా తిరుమలలో కల్తీ నెయ్యిపై ఆగ్రహావేశాలు - భక్తుల మనోభావాలు దెబ్బతీశారని విమర్శలు - Tirumala Laddu Issue in AP

Political Leaders Comments on Tirumala Laddu Issue in AP: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించడంపై భక్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల జగన్​కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి .కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ భక్తులు మండిపడుతున్నారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్​ చేస్తున్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని బ్రాహ్మణ సంఘాలు కోరుతున్నారు. | Read More

ETV Bharat Live Updates

09:19 AM, 21 Sep 2024 (IST)

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో బిగ్ ట్విస్ట్ - ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలన్ని అవాస్తవాలన్న బాధితురాలు - AP HC on MLA Adimulam Case

HC on Adimulam Issue: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన అత్యాచారం కేసులో హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవమని బాధితురాలు న్యాయస్థానానికి తెలిపింది. ఎమ్మెల్యేపై నమోదు చేసిన కేసు తప్పుడు కేసు అని న్యాయమూర్తికి వివరించింది. ఆదిమూలంపై కేసును కొట్టేయాలని కోరింది. ఈ విషయాలను పరిగణలోనికి తీసుకున్న ధర్మాసనం ఆదిమూలంపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అనంతరం విచారణ ఈనెల 25కి వాయిదా వేసింది. | Read More

ETV Bharat Live Updates

09:09 AM, 21 Sep 2024 (IST)

స్వర్ణాంధ్ర-2047 విజన్‌ డాక్యుమెంట్‌ - ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశం - Swarnandhra 2047 Vision

Swarnandhra 2047 Vision Document Gudelines in AP: వికసిత్​ భారత్​ 2047లో భాగంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే జిల్లా, మండలాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విజన్​ ప్రణాళికలపై ప్రజల అభిప్రాయాలు సేకరించాలని సూచనలు చేసింది. | Read More

ETV Bharat Live Updates

08:00 AM, 21 Sep 2024 (IST)

తిరుమల లడ్డూ కల్తీ వివాదం - బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి : రాహుల్ గాంధీ, వెంకయ్యనాయుడు - TIRUMALA LADDU ISSUE

Tirumala Laddu Issue in AP : తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు ఈ వివాదంపై స్పందిస్తున్నారు.కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ భక్తులు మండిపడుతున్నారు. తిరుమలలో లడ్డూల కల్తీపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని రాహుల్​గాంధీ అన్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదాలపై వస్తున్న వార్తలు తనను ఎంతో కలిచివేశాయని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates

07:27 AM, 21 Sep 2024 (IST)

గోవిందా అపచారం అపచారం - తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం దుర్మార్గమే! - Tirumala Laddu Issue Updates

Tirumala Laddu Issue Updates: పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలవటం ఘోర అపచారమనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. కిలో నెయ్యి కేవలం రూ.320కే కొనుగోలు చేసేలా గుత్తేదారుడితో ఒప్పందం చేసుకోవడమేగాక తూతూ మంత్రంగానే తిరుమల ల్యాబ్‌లో నాణ్యత పరీక్షలు నిర్వహించారు. దీంతో తిరుమలలోని ల్యాబ్‌లో నాణ్యతా పరీక్షలు సరిగా జరగడంలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ ధరను రెట్టింపు చేసి నాణ్యతకు తిలోదకాలిచ్చారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50 ఏళ్లుగా సరఫరా చేస్తున్న కర్ణాటక నందిని నెయ్యిని పక్కనపెట్టి కల్తీ నెయ్యిని కొనుగోలు చేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. | Read More

ETV Bharat Live Updates
Last Updated : 27 minutes ago

ABOUT THE AUTHOR

...view details