Ganesh Chaturthi Festival was Celebrating Grandly in AP : వినాయక చవితి పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. వీధివీధి, వాడవాడలా మండపాలు ఏర్పాటు చేసి గణనాథునికి తొలి పూజలు నిర్వహించారు. వివిధ రూపాల్లో కొలువు దీరిన వినాయకులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 7 September 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Sat Sep 07 2024- ఊరువాడ పూజలు అందుకున్న గణనాథుడు - వివిధ రూపాల్లో బొజ్జ గణపయ్య - Ganesh Chaturthi Celebrations in AP
By Andhra Pradesh Live News Desk
Published : Sep 7, 2024, 7:55 AM IST
|Updated : Sep 7, 2024, 7:18 PM IST
ఊరువాడ పూజలు అందుకున్న గణనాథుడు - వివిధ రూపాల్లో బొజ్జ గణపయ్య - Ganesh Chaturthi Celebrations in AP
మల్లాపూర్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం - ఎగిసిపడుతోన్న మంటలు - Fire Accident At Mallapur In HYD
Fire Accident At Mallapur Industrial Estate : హైదరాబాద్ మల్లాపూర్లోని పారిశ్రామికవాడలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెయింట్ పరిశ్రమలో మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. | Read More
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం - పలు జిల్లాల్లో భారీ వర్షాలు - IMD Issues Rainfall Alert
IMD Issues Rainfall Alert to Andhra pradesh: రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వానలకు ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. వరదలు ఇప్పుడిప్పుడే తగ్గి అంతా కుదుట పడుతుందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో వాతావరణ శాఖ మరో ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. | Read More
వరదలతో రూ. 6,882 కోట్లు నష్టం - ప్రాథమిక నివేదిక సిద్ధం - Report on AP Floods Loss
Report on AP Floods Loss 2024: ఏపీలో వరద విపత్తు వలన 6 వేల 882 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ మేరకు నివేదికను కేంద్రానికి పంపేందుకు సిద్ధం చేసింది. | Read More
శరవేగంగా పారిశుద్ధ్య పనులు - డ్రోన్ల సాయంతో బ్లీచింగ్ పిచికారి - drones for vijayawada sanitation
Drones For Vijayawada Sanitation Works: విజయవాడలో వరద తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో పనులు చేపట్టారు. నిలువ ఉన్న వరద నీటిలో దోమలు వ్యాప్తి చెందకుండా, డ్రోన్ల సాయంతో బ్లీచింగ్ పిచికారి చేస్తున్నారు. వందల మంది కార్మికులు చేసే పనిని, డ్రోన్ల ద్వారా తక్కువ సమయంలో చేస్తున్నారు. అదే విధంగా పారిశుద్ధ్య కార్మికులు మురుగు కాలువల్లో చేరిన పూడికను తొలగిస్తున్నారు. | Read More
ప్రజల ప్రాణాలు కాపాడేందుకు 'మేమున్నామంటారు' - ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యక్ష దైవమంటున్న జనం - NDRF Save Lots of People in Floods
NDRF Rescue Lots of People in Vijayawada: ఆపదలో ఉన్నామంటే చాలు ఆపధ్బాందవుల్లా వస్తారు. చేయి చాపి ఆపన్న హస్తం అందిస్తారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయరు. మెరుపు వేగంతో బాధితుల వద్దకు చేరుకుని అంతే వేగంతో అవసరమైన సహాయం చేసి వెళ్లిపోతారు. మరికొందరికి సాయం చేసేందుకు మరో చోటికి పరుగులు పెడతారు. తన, మన భేదం లేదు. అందరికీ సాయం అందిస్తారు. ప్రమాదాల నుంచి తప్పించడమే కాదు. ప్రమాదాల బారిన పడకుండా ప్రజలను రక్షిస్తారు. ఆకలి దప్పికలను తీర్చడమే కాదు ప్రాణాలనూ రక్షిస్తారు. ఆసరాగా నిలిచేందుకు ఆత్మీయులే వెనకంజ వేస్తోన్న పరిస్ధితుల్లోనూ మేమున్నామంటూ వరద ప్రాంతాల్లో ముందుండి నడిపిస్తున్నారు. వీరే కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఎన్టీఆర్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వీరందిస్తోన్న సేవలకు గ్రామస్థులంతా ఫిదా అయిపోయారు. తమ ప్రాణాలను కాపాడుతున్న దైవాలంటూ చేతులెత్తి దండం పెడుతున్నారు. | Read More
పండుగ వేళ మామిడాకుల కోసం గొడవ - వ్యక్తిపై కత్తితో దాడి - Accidents on Vinayaka Chavithi
Tragedy Incidents on Vinayaka Chavithi 2024: రాష్ట్రంలో వినాయక చవితి పండుగ జరుపుకుంటున్న సందర్భంలో పలుచోట్లు విషాద ఘటనలు చొటుచేసుకున్నాయి. కృష్ణా జిల్లాలో మామిడాకుల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ చివరికి కత్తిపోట్లకు దారి తీసింది. నెల్లూరు జిల్లాలో వినాయకుని విగ్రహం తీసుకువెళ్తున్న ట్రాక్టర్ని టిప్పర్ ఢీ కొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయి. మరోచోట వినాయక మండపంలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు. | Read More
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లకు పూర్తయిన మరమ్మతులు - ఇక పడవల తొలగింపుపై దృష్టి - works Completed in Prakasam Barrage
Prakasam Barrage New Counterweight works Completed : ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులను అధికారులు పూర్తి చేశారు. 67, 69వ గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను విజయవంతంగా అమర్చారు. భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా రెండు రోజుల్లోనే ఇంజినీర్లు, సిబ్బంది గేట్ల మరమ్మతు పనులు పూర్తి చేశారు. నిపుణుడు కన్నయ్యనాయుడు మార్గదర్శనంలో విజయవంతంగా గేట్ల మరమ్మతులు పూర్తయ్యాయి. కీలక ఘట్టం పూర్తి కావడంతో అడ్డుగా ఉన్న పడవల తొలగింపుపై అధికారుల దృష్టి సారించారు. | Read More
ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతికి సీఎం రేవంత్ తొలి పూజ - దర్శననానికి పోటెత్తిన భక్తులు - Khairatabad Ganesh first puja
Khairatabad Ganesh : రాష్ట్రంలో వినాయక చవితి సంబురాలు మొదలయ్యాయి. ఖైరతాబాద్లో గణేశుని విగ్రహం ప్రతిష్ఠించారు. లంబోదరుడికి సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజ చేశారు. ఖైరతాబాద్లోని సప్తముఖ మహాశక్తి గణపతిని చూడడానికి భక్తులు పోటెత్తారు. | Read More
రాష్ట్రవ్యాప్తంగా గణేశుడి సందడి - విజయవాడలో సీఎం చంద్రబాబు పూజలు - Ganesh Chathurthi 2024
Ganesh Chathurthi Celebrations 2024 : ఏపీలో వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఏకదంతుని మండపాలతో ఊరూవాడా కోలాహలంగా మారింది. వివిధ రూపాల్లో రూపుదిద్దుకున్న గణనాథుని విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. భక్తులు స్వామి వారికి ఇష్టమైన నైవేథ్యాలను సమర్పిస్తున్నారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణేశుడిని సీఎం చంద్రబాబు దర్శించుకుని పూజలు నిర్వహించారు. | Read More
విజయవాడ సింగ్ నగర్లో తగ్గుతున్న వరద - సహాయక చర్యలు వేగవంతం - Relief Work in Flood Affected Areas
Relief Works in Vijayawada Flood Affected Areas: విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో వరద క్రమంగా తగ్గుతోంది. ముంపునకు గురైన ప్రాంతాలు ఇప్పుడిపుడే తేరుకుంటున్నాయి. ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ పనుల్లో వేగం పెంచింది. వరద ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆహారం, పాలు, మంచినీళ్లు వంటివి తమకు అందించిందని ప్రజలు చెబుతున్నారు. | Read More
గూగుల్ మ్యాప్ గుర్తించని వరద - స్పందించిన అధికారులు- తల్లీ, కొడుకు సేఫ్ - Google Map mistake vijayawada
Car Stuck in Flood Due to Google Map Misdirection Near Vijayawada : ఎక్కడికి వెళ్లాలన్నా వాహనం, చేతిలో ఫోన్ ఉంటే చాలు అనుకునే వారే ఎక్కువ ఈ రోజల్లో. వెళ్లాల్సిన ప్రదేశానికి దారి కూడా తెలియదు కొందరికైతే. గూగుల్ మ్యాప్తో ప్రంపంచాన్ని చుట్టేయచ్చొంటారు కొందరు. కానీ ఈ మ్యాప్స్ను అనుసరించి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వాళ్లు లేకపోలేదు. ఇటువంటి ఘటనే విజయవాడ సమీపంలో జరిగింది. మ్యాప్స్ను ఫాలో చేస్తూ వరదలో చిక్కుకుంది తల్లి, కొడుకు ఉన్న కారు. చివరికి ఏం జరిగిందంటే! | Read More
ఘనంగా ప్రారంభమైన కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు - Kanipaka Vinayaka Brahmotsavams
Kanipaka Vinayaka Brahmotsavam: చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీకాణిపాక వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ వేడుకలు 21 రోజులపాటు కన్నుల పండువగా జరగనున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి గణనాయకుడి బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. | Read More
రాజమహేంద్రవరంలో చిరుత కలకలం -అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన - Cheetah in East Godavari
Cheetah in East Godavari District : తూర్పుగోదావరి జిల్లాలో చిరుత కలకలం సృష్టించింది. రాజమండ్రి నగర శివారులో చిరుత పులి సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురైయ్యారు. దీంతో పోలీసులు, అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత తిరిగిన ప్రాంతాల్లో 6 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరిసరాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. | Read More
వరద బాధితుల కోసం అమ్మలా 'అక్షయపాత్ర' - ఇప్పటి వరకు 10.30 లక్షల మందికి ఆహారం - Akshaya Patra Support Flood Victims
Akshaya Patra Support in Flood Victims : ఆకలితో అల్లాడుతున్న లక్షల మంది బాధితులను ఆదుకోవాలంటే గిన్నెలు, గుండిగలు సరిపోవు. అందుకే అక్షయపాత్ర ఉండాల్సిందే. వరద బాధితుల్లో ఏ ఒక్కరూ ఇళ్లలో వంట చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. వరద తగ్గినా బురద బాధ మరికొన్నాళ్లు ఉంటుంది. వారందరి ఆకలి తీర్చేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ప్రతి నాలుగు గంటల్లో లక్ష మందికి వండి వారుస్తూ అమ్మ పాత్ర పోషిస్తోంది. | Read More
విశాఖ విమానాశ్రయంలో డిజియాత్ర సేవలు- ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు - Digiyatra starts at visakha Airport
Digi Travel Services Start at visakhapatnam Airport by Central Minister : పట్టుదలతో భోగాపురం విమానాశ్రయ పనులు ముందుకు నడిపిస్తున్నారు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఈ-డిజియాత్రను ప్రారంభించారు. | Read More
కేంద్రం రూ.3,300 కోట్లు సాయం ప్రకటిందన్న ప్రచారం అవాస్తవం - నేడు తొలి నివేదిక పంపుతాం: సీఎం చంద్రబాబు - Change in Vijayawada After Floods
Chandrababu Will Change Vijayawada: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల విపత్తు వల్ల విజయవాడలో వచ్చిన సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని నగరాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వరద బాధితులకు అండగా నిలవాలని ఇతర ప్రాంతాల ప్రజలకు పిలుపునిచ్చారు. వరదలకు ముందు, ఆ తర్వాత అనేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. | Read More
ఏకు మేకైన వైనం - శ్రీశైలంలో ఆలయమంటూ హడావిడి - 2 ఎకరాలని 28 ఎకరాల్లో పాగా - Private Temple Issue in Srisailam
Private Temple Construction Issue in Srisailam : శ్రీశైలంలో కోట్ల రూపాయలతో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయమంటూ వీబీ టెక్నోక్రాఫ్ట్స్ సంస్థ హడావిడి చేసింది. ఇందుకోసం భూమిని కేటాయించాలని అభ్యర్థించింది. ఆ తర్వాత అజేయ కల్లం తదితరులతో ఓ ట్రస్టును ఏర్పాటు చేసింది. మరోవైపు గుడి నిర్మాణానికి అనుమతలు ఇవ్వాలని దేవాదాయశాఖ అధికారులపై ఉన్నతస్థాయి ఒత్తిళ్లు తెచ్చింది. ఇలా ఆ సంస్థ చిన్నగా వచ్చి ఏకు మేకై కూర్చుంది. | Read More
కృష్ణమ్మ వరద జోరు - ఆక్వా రైతు బేజారు - Aqua Farmers Problems
Prawns Damage in Krishna District : కృష్ణమ్మ ఉగ్రరూపం ఆక్వా రైతులకు శాపంగా మారింది. భారీ వరదకు కృష్ణా జిల్లా దివిసీమలోని చెరువులన్నీ మునిగిపోయాయి. సరుకంతా చనిపోవడంతో పెట్టుబడంతా నీటి పాలై నిండా మునిగిపోయామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. | Read More
వరద బాధితులకు పోలీసుల సాయం-ఒకరోజు వేతనం 12 కోట్ల విరాళం - Huge Donations to CMRF AP
Aid Continues to Pour in For Flood Victims : వరద బారిన పడి సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలిచేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సహాయక చర్యలను చేపడుతున్న ప్రభుత్వానికి తోడ్పాటు అందించేందుకు వివిధ వర్గాలు, ప్రాంతాల వారు తమ స్థాయిని బట్టి విరాళాలను అందిస్తున్నారు. | Read More
బుడమేరు మూడో గండి పనులు మరి కొన్ని గంటల్లో పూర్తవుతాయి: మంత్రి నిమ్మల రామానాయుడు - Nimmala on Budameru Leakage
Minister Nimmala Ramanaidu About Budameru Leakage Works : బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఈ పనులను ఈ రోజు ఉదయానికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఉద్ధృతంగా వరద ఉన్నప్పుడే రెండు గండ్లను పూడ్చారు. మూడో గండి పనులు దాదాపు పూర్తి అయినట్లే అని మంత్రి నిమ్మల తెలుపుతున్నారు. | Read More
యుద్ధప్రాతిపదికన సాగుతున్న బుడమేరు పనులు - గండ్లు పూడ్చేందుకు శ్రమిస్తున్న సైన్యం - Army Helping in Budameru Works
Budameru Leakage Works: కృష్ణా జిల్లా కవులూరు వద్ద బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత పనులు శరవేగంగా సాగుతున్నాయి. గండిని పూడ్చేందుకు ఒకవైపు ఏజెన్సీలు, మరోవైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి శ్రమిస్తున్నారు. ఇప్పటికే రెండు గండ్లను పూడ్చగా నేడు ఎలాగైనా మూడో గండిని పూడ్చాలని భావిస్తున్నారు. | Read More
సహాయక చర్యలతో వరద బాధితులకు బాసట - Help to Vijayawada Flood Victims
Voluntary Organizations and Donors Help to The Vijayawada Flood Victims : వరద తాకిడికి అతలాకుతలం అయిన విజయవాడ వాసులకు సహాయం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగమంతా రంగంలోకి దిగింది. ఇటువంటి విపత్కర పరిస్థుతుల్లో దాతలు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వారు వచ్చి పారిశుద్ద్య సహా పలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. | Read More
తొలిపూజలు అందుకునేందుకు సిద్ధమైన బొజ్జగణపయ్య - ఊరూవాడా కోలాహలంగా ఏకదంతుని మండపాలు - VINAYAKA CHAVITHI Festival in AP
Ganesh Chaturthi Festival: వినాయక చవితి సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా సందడి నెలకొంది. తొలిపూజలు అందుకునేందుకు విఘ్నేశ్వరుడు ముస్తాబయ్యాడు. వాడవాడల్లో విభిన్న హంగులతో నిర్వాహకులు వినాయక మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఏకదంతుని మండపాలతో ఊరూవాడా కోలాహలంగా మారింది. వివిధ రూపాల్లో రూపుదిద్దుకున్న బొజ్జ గణపయ్య ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. | Read More
చురుగ్గా ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులు - రేయింబవళ్లు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ - Prakasam Barrage Gates Works
Gates Repair Works in Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తిచేయాలని సంకల్పించిన ప్రభుత్వం పనుల్ని వేగంగా చేస్తోంది. ఏడు రోజుల్లో పనులన్నింటినీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ రెండు రోజుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసేలా అనుభవజ్ఞులైన ఇంజినీర్లు, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పడవలు ఢీ కొట్టడంతో ధ్వంసమైన కౌంటర్ వెయిట్ల తొలగింపు ఇప్పటికే పూర్తికాగా ఇవాళ అధునాతన రీతిలో తయారు చేసిన కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేయనున్నారు. | Read More