ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మళ్లీ ఏపీలో ఎన్నికల సందడి - ఓటర్లుగా పేర్లు ఇలా రిజిస్టర్ చేసుకోండి

ఓటర్లుగా పేర్లు నమోదుకు నవంబరు 6వ తేదీ వరకు గడువు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

AP_Graduate_MLC_Elections
AP Graduate MLC Elections (ETV Bharat)

AP GRADUATE MLC ELECTIONS 2024: ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పట్టభద్రులు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. నమోదుకు నవంబరు 6వ తేదీ వరకు గడువు ఉంది. అవసరమైన పత్రాలను ఆయా మండలాల్లోని తహసీల్దారు, ఎంపీడీవో కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామని, ceoandhra.nic.in వెబ్‌సైట్‌ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు వివరించారు.

ఇవి తప్పకుండా గుర్తుపెట్టుకోండి:

  • 2021 సెప్టెంబరు నాటికి డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులుగా ఈసీ తెలిపింది. అప్పట్లోగా డిగ్రీ పూర్తి చేసినవారు 2025లో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఇప్పుడే ఓటరుగా నమోదు చేసుకోవాలి.
  • ఓటు నమోదుకు సంబంధించి రెండు జిల్లాలకు ఈఆర్వోగా (Electoral Registration Officer) గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారి వ్యవహరిస్తారు. ఆయా మండలాల తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, అదనపు కమిషనర్లు ఏఈఆర్వోలుగా (Assistant Electoral Registration Officer), ఎంపీడీవోలు డిజిగ్నేటెడ్‌ అధికారులుగా, పోస్ట్ మాస్టర్లు, ప్రభుత్వ కాలేజీలు ప్రిన్సిపాళ్లు అదనపు డిజిగ్నేటెడ్‌ అధికారులుగా వ్యవహరిస్తారు.
  • ఒకే కుటుంబంలో పదిమంది పట్టభద్రులుంటే వారందరి అప్లికేషన్​లను సంబంధిత ఏఈఆర్వోకు ఇవ్వొచ్చు.
  • ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్నవారు పూర్తి చేసిన దరఖాస్తులను కంపెనీ ప్రతినిధి ద్వారా ఏఈఆర్వోకు అందివ్వొచ్చు. దరఖాస్తులో పేర్కొన్న చిరునామా ప్రకారం ఆ ప్రాంతంలోని ఏఈఆర్వోకే ఇవ్వాలి.
  • ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందినవారు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నట్లయితే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కచ్చితంగా సెల్ఫ్, గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణ తప్పనిసరి.
  • దరఖాస్తులను సంబంధిత బీఎల్‌వోలు (Booth Level Officer) పరిశీలించి పేర్లను ఓటరు జాబితాలో చేర్చేందుకు చర్యలు చేపడతారు.

గతంలో దరఖాస్తు చేసుకున్నా:గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకున్న వారు కూడా మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. పాత ఓటర్ల జాబితా రద్దు అవుతుంది. ఎప్పటికప్పుడు కొత్త జాబితాతోనే ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహిస్తారు. 2019 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో లక్షా 41 వేల 970 మంది, ఉమ్మడి కృష్ణా జిల్లాలో లక్షా 6 వేల 829 మంది ఓటర్లు ఉన్నారు.

అవసరమైన డాక్యుమెంట్స్:

  • ఓటు అప్లికేషన్​ ఫారం-18
  • డిగ్రీ ప్రొవిజినల్‌ లేదా ఒరిజినల్‌ డిగ్రీ సర్టిఫికేట్
  • ఆధార్‌ జిరాక్స్
  • ఓటరు ఐడీ
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటో
  • ఫోన్ నంబరు
  • ప్రతీ డాక్యుమెంట్​పైనా స్వీయ, గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణలు ఉండాలి.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 18న టీడీఎల్పీ సమావేశం

ABOUT THE AUTHOR

...view details