ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫైబర్​నెట్‌కు మళ్లీ ఊపిరి - రూ.149 బేసిక్ ప్లాన్​పై ప్రభుత్వం ఫోకస్ - AP GOVT FOCUS ON FIBERNET

ఫైబర్‌ నెట్‌ను మళ్లీ గాడిలో పెట్టేలా ప్రభుత్వం చర్యలు - టీవీ, ఇంటర్‌నెట్ , ఫోన్ కనెక్షన్ తక్కువ ధరకే ఇచ్చేలా చర్యలు

AP Govt Focus on FiberNet
AP Govt Focus on FiberNet (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2025, 10:40 AM IST

AP Govt Focus on FiberNet :ఇంటింటికీ కేబుల్ టీవీ, ఫోన్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్‌కు చౌకగా అందించే ఫైబర్‌నెట్‌ మళ్లీ ప్రజాదరణ చూరగొనేందుకు శక్తియుక్తులు కూడగడుతోంది. రూ.149 బేసిక్ ప్లాన్‌ను మళ్లీ ప్రవేశపెట్టి రాష్ట్రంలో కోటిమందికి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ నుంచి సరికొత్త కార్యాచరణ అమల్లోకి తెచ్చేలా రంగం సిద్ధమవుతోంది. ఏపీలో ఇంటింటింకీ అతి తక్కువ ధరకే చౌకగా వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించాలనే సంకల్పంతో 2017లో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రాజెక్టు ఏపీ ఫైబర్​నెట్.

అప్పట్లో ఇంటర్నెట్, కేబుల్, ల్యాండ్ ఫోన్​లను సర్వీస్ ప్రొవైడర్లు విడివిడిగా అందిస్తుండగా వాటికి నెలవారీ బిల్లు తడిసి మోపెడయ్యేది. మూడు రకాల సేవల్ని ఒకే కనెక్షన్‌గా ఇచ్చి దేశం దృష్టిని ఆకర్షించించింది నాటి టీడీపీ ప్రభుత్వం. కేవలం రూ.149కే బేసిక్ ప్లాన్ నిర్ణయించి, కేబుల్ ఆపరేటర్లను భాగస్వాములను చేయడంతో వారే ఇంటింటికీ తిరిగి ఇళ్లకు ఫైబర్​నెట్ కనెక్షన్లను ఏర్పాటు చేశారు. 2019 మార్చి నాటికి 17 లక్షల కనెక్షన్లు ఇచ్చింది.

కోటికి పెంచడమే లక్ష్యం : వైఎస్సార్సీపీ హయాంలో ఫైబర్‌నెట్‌ పడకేసింది. ఐదేళ్లలో 17 లక్షల కనెక్షన్లు కాస్తా 5 లక్షలకు దిగజారాయి. సంస్థ ఆదాయం గణనీయంగా తగ్గింది. గత ప్రభుత్వ నేతల అవినీతి అక్రమాలతో సంస్థను పీకల్లోతు అప్పుల్లో ముంచి ఫైబర్‌నెట్‌ను దివాలా అంచులకు నెట్టారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఫైబర్‌నెట్‌కు పూర్వవైభవం తేవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎం ఆదేశాలతో మంత్రి బీసీ జనార్దన్​రెడ్డి, సంస్థ ఛైర్మన్‌ జీవీరెడ్డి కనెక్షన్ల సంఖ్యను కోటికి పెంచడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు.

FiberNet Services to Expand in AP : గత ప్రభుత్వం పెంచిన ప్లాన్‌ల ధరలు తగ్గించి నెలకు రూ.149 బేసిక్ ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఏప్రిల్​లోపు కొత్త బాక్సుల కొనుగోలు సహా అసరమైన సాంకేతికత, మానవ వనరులు సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఫైబర్‌నెట్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తున్నారు. జగన్ హయాంలో వైఎస్సార్సీపీ నేతల ఇళ్లలో పనిచేసే వారికి సంస్థలో పోస్టులిచ్చి వేతనాలిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అర్హత లేని 600 మందిని తొలగించి ఆ డబ్బును ఆదా చేశారు. వారి స్థానంలో సమర్థత కల్గిన వారిని విధుల్లోకి తీసుకోనున్నారు. ఇప్పటికే నియామక ప్రక్రియ ప్రారంభించారు. విద్యా సంస్థల్లోనూ ఫైబర్‌నెట్‌ సేవల్ని విస్తరించాలని భావిస్తున్నారు.

తక్కువ ధరకే నాణ్యమైన ఇంటర్నెట్, కేబుల్ నెట్​వర్క్​- 50 లక్షల కనెక్షన్ల టార్గెట్ : జీవీ రెడ్డి

'RGV సినిమా ఒక్కసారి చూస్తే రూ.11వేలు' - నోటీసులు పంపిన APSFL

ABOUT THE AUTHOR

...view details