తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ మంత్రి నారా లోకేశ్​ వాట్సాప్​ బ్లాక్​ - ఎందుకో తెలుసా? - AP Minister Lokesh Whatsapp Block

AP Minister Lokesh Whatsapp Block: ఏపీ మంత్రి నారా లోకేశ్ వాట్సప్​ బ్లాక్​ అయ్యింది. ఆయన మొబైల్​ నంబర్​కు లెక్కకు మించి మెసేజ్​లు వస్తుండడంతో వాట్సాప్‌ను మెటా బ్లాక్ చేసింది. ఈ నేపథ్యంలో లోకేశ్ ఎలా స్పందించారంటే!

By ETV Bharat Telangana Team

Published : Jul 11, 2024, 7:10 PM IST

AP Minister Lokesh Whatsapp Block
AP Minister Lokesh Whatsapp Block (ETV Bharat)

Andhra Pradesh IT Minister Nara Lokesh Blocked WhatsApp : యువగళం ద్వారా నేరుగా ప్రజల జీవన స్థితిగతులను పరిశీలించిన ఏపీ టీడీపీ నేత, మంత్రి లోకేశ్​ సామాన్యుల సమస్యలపై స్పందించారు. ఒక్క మెసేజ్‌ పెడితే వెంటనే స్పందిస్తానని భరోసా కల్పించారు. ఏపీ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, ఏ సహాయం కావాలన్నా, మార్గదర్శకం కావాలన్నా అన్నగా తోడుంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో లోకేశ్ వాట్సప్​ నంబర్​కు సమస్యల మెస్సెజ్​లు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో సాంకేతిక సమస్యలు ఎదురవడంతో మెటా బ్లాక్​ చేసింది. దీనిపై లోకేశ్​ ఏమన్నారంటే?

''అధికారులు ఇంకా మారాల్సి ఉంది సార్‌' - 'లేదు మారారులే'' - చంద్రబాబు - లోకేశ్‌ మధ్య ఇంట్రెస్టింగ్‌ డిస్కషన్ - cbn and lokesh Conversation

సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి తనకు hello.lokesh@ap.gov.in ఈ మెయిల్ ఐడీకి పంపాలని ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పంపుతున్న మెసేజ్‌లు పోటెత్తడంతో మంత్రి నారా లోకేశ్ వాట్సప్​ను మెటా బ్లాక్ చేసింది. ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న మంత్రి లోకేశ్ వాట్సప్ బ్లాక్ కావడం, తరచూ ఇదే సమస్య ఉత్పన్నం అవుతుండటంతో తన పర్సనల్ మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.in కి ప్రజలు తమ వినతులు, సమస్యలు పంపించాలని ఒక ప్రకటనలో కోరారు.

మెసేజ్​లకు మంత్రి లోకేశ్​ స్పందన : సాయం కోసం వచ్చే ప్రజలకు తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఎన్నికలకు ముందే ప్రకటించిన లోకేశ్, మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఉండవల్లి నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు ప్రతిరోజు ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో తన వాట్సప్‌కి వచ్చిన మెసేజ్​పై స్పందించిన మంత్రి లోకేశ్ 25 మంది దివ్యాంగ విద్యార్థుల సమస్య పరిష్కరించారు.

ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు సాధించిన వారందరినీ అభినందించడంతో పాటు సొంత ఖర్చుతో ల్యాప్‌టాప్‌లు అందించారు. ఈ నేపథ్యంలో తమ సమస్య మంత్రి నారా లోకేశ్​ దృష్టికి తీసుకెళితే చాలు పరిష్కారం అయిపోతుందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నమ్ముతున్నారు. వేలాది మంది తమ సమస్యలను ఒకేసారి మంత్రి నారా లోకేశ్​కి వాట్సప్ చెయ్యడం వలన టెక్నికల్ సమస్యతో బ్లాక్ అయింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్సనల్ మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.in కి సమస్యలన్నీ పంపించాలని విజ్ఞప్తి చేస్తూ తానే స్వయంగా హ్యాండిల్​ చేస్తానని భరోసా కల్పించారు.

పాదయాత్రలో యువతకు తనను దగ్గరగా చేర్చిన "హలో లోకేశ్​" కార్యక్రమం పేరుతోనే మంత్రి లోకేశ్​ ఈ మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకున్నారు. తానే అందరి సమస్యలు నేరుగా పరిశీలిస్తానని ప్రకటించారు. పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, సమస్య-సహాయానికి సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరచాలని సూచించారు. మెయిల్ చేస్తే తాను స్పందిస్తానని తెలియజేశారు. వాట్సప్ తరచూ బ్లాక్ కావడంతో ప్రజలు పంపే మెసేజ్​లు చూసే అవకాశం ఉండటం లేదని , దయచేసి అందరూ మెయిల్ ఐడీకే వినతులు పంపించాలని మంత్రి నారా లోకేశ్ ఒక ప్రకటనలో విన్నవించారు.

టెట్‌ అర్హత సాధించని వారికి మంత్రి లోకేశ్‌ గుడ్ న్యూస్‌ - వారికి మళ్లీ పరీక్ష పెడతారంటా - Minister Nara Lokesh on TET Result

ఏపీ, తెలంగాణ నాకు రెండు కళ్లు - రేవంత్ పాలన చాలా బాగుంది : ఏపీ సీఎం చంద్రబాబు - AP CM CBN AT NTR Bhavan In Hyd

ABOUT THE AUTHOR

...view details