తెలంగాణ

telangana

ETV Bharat / politics

200 యూనిట్లు కరెంట్‌ ఇవ్వడం పెద్ద సమస్యేమీ కాదు : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Minister Komatireddy Venkat Reddy Comments on KCR : కేసీఆర్​ అసమర్థత వల్ల నల్గొండ జిల్లాలో నీళ్ల కొరత ఏర్పడిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గులాబీ నేతలు వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. 6 గ్యారెంటీలపై ఆందోళన వద్దన్నారు. కరెంట్ బిల్లులు కట్టొద్దన్న కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. 200 యూనిట్లు కరెంట్‌ ఇవ్వడం తమకు పెద్ద సమస్య ఏమీ కాదన్నారు.

By ETV Bharat Telangana Team

Published : Jan 22, 2024, 4:02 PM IST

Updated : Jan 22, 2024, 7:14 PM IST

Komatireddy Fires on BRS Leaders
Minister Komatireddy Venkat Reddy Comments on KCR

Minister Komatireddy Venkat Reddy Comments on KCR :కేసీఆర్ అసమర్థ పాలన వల్ల జిల్లాలో నీళ్లులేని పరిస్థితి నెలకొందని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం(Kaleshwaram)ప్రాజెక్టు పేరుతో బీఆర్​ఎస్​ నేతలు వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సత్వరమే వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఈనెల నుంచి కరెంట్ బిల్లులు కట్టొద్దని కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. 200 యూనిట్లు కరెంట్‌ ఇవ్వడం తమకు పెద్ద సమస్య ఏమీ కాదన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని భరోసా అన్నారు. నల్గొండ (Nalgonda) జిల్లాలో మంచినీళ్లు లేకపోవడానికి కారణం కేసీఆర్​ అని మండిపడ్డారు. మిషన్ భగీరథ (Mission Bhagiratha)పేరుతో పెద్ద ఎత్తున అవినీతీకి తెరతీశారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. యాదాద్రి పవర్‌ ప్లాంట్​పై విచారణ జరుగుతుందని, సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపిస్తామన్నారు.

'200 యూనిట్ల కరెంట్​ ఇస్తానికి మాకు పెద్ద సమస్య ఏమీ కాదు. సంవత్సరానికి రూ. 400 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రభుత్వ వ్యవస్థను గాడిలో పెట్టేలా, ప్రణాళిక ప్రకారం అమలు చేస్తున్నాం. ఈ పథకాలన్నీ 100 రోజులలోపే అమలు చేస్తాం. 120 నెలలు అధికారంలో ఉన్నా రేషన్​కార్డు, ఇళ్లు ఇవ్వని వాళ్లు ఇవాళ ప్రశ్నిస్తున్నారు. నల్గొండ జిల్లాలో మంచినీటి కొరత రావడానికి కారణం కేసీఆరే.కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో కోటి 50 లక్షల అర్జీలు వచ్చాయంటే తెలంగాణలో ఏం జరిగిందని అర్థం చేసుకోవాలి. నిన్న పగిడిమర్రి గ్రామంలో ఆరు బోర్లు వేస్తే ఆరు ఫెయిల్​ అయ్యాయని సర్పంచులు చెబుతున్నారు. ఏ గ్రామల్లో చూసినా నీళ్లు లేవు. కాళేశ్వరం పేరుతో రూ. 1,70,000 వేల కోట్లు వృథా చేశారు. ఆ డబ్బునే గులాబీ నేతలు కూడా దోచుకున్నారు' - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రోడ్లు, భవనాలు శాఖ మంత్రి

Minister Komatireddy Venkatreddy on BRS Leaders : నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ట్రిపుల్​ ఆర్​(RRR)తెలంగాణకు మణిహారమని, అలైన్‌మెంట్‌ మార్చేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వివరించారు. ఆ విషయంపై ఇప్పటికే అధికారులతో సమీక్షించినట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో బీఆర్​ఎస్​ నాయకులపై మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాజీ మంత్రులు, కేటీఆర్‌, హరీశ్‌రావు, బీఆర్​ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

200 యూనిట్లు కరెంట్‌ ఇవ్వడం పెద్ద సమస్యేమీ కాదు : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఆర్​ఆర్​ఆర్​ అలైన్​మెంట్ మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఇంకో ఏడెనిమిది స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రంలో హంగ్​ వచ్చేది : కేటీఆర్

Last Updated : Jan 22, 2024, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details