AP Congress Announced MLA Candidates List:రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. 38 మంది అసెంబ్లీ అభ్యర్థులతో కూడిన జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం ప్రకటించారు. 28 స్థానాలకు కొత్త అభ్యర్థులను ప్రకటించగా ఇప్పటికే ప్రకటించిన 10 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు.
28 మంది అభ్యర్థులు
- బొబ్బిలి- మరిపి విద్యాసాగర్
- నెల్లిమర్ల - ఎస్.రమేశ్కుమార్
- విశాఖపట్నం ఉత్తరం - లక్కరాజు రామారావు
- చోడవరం - జగత్ శ్రీనివాస్
- యలమంచిలి - టి.నర్సింగ్ రావు
- పి.గన్నవరం (ఎస్సీ) - కె.చిట్టిబాబు
- ఆచంట - నెక్కంటి వెంకట సత్యనారాయణ
- విజయవాడ (ఈస్ట్) - సుంకర పద్మశ్రీ
- జగ్గయ్యపేట - కర్నాటి అప్పారావు
- రేపల్లె - మోపిదేవి శ్రీనివాసరావు
- తెనాలి - ఎస్కే బషీద్
- గుంటూరు వెస్ట్ - డాక్టర్. రాచకొండ జాన్ బాబు
- చీరాల - ఆమంచి కృష్ణమోహన్
- కావలి - పొదలకూరి కల్యాణ్
- వెంకటగిరి - పి.శ్రీనివాసులు
- కడప- తుమ్మన్ కల్యాల్ అస్జల్ అలీఖాన్
- పులివెందుల- మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి
- జమ్మలమడుగు - బ్రహ్మానందరెడ్డి పాముల
- ప్రొద్దుటూరు - షేక్ పూల మహ్మద్ నజీర్
- మైదుకూరు- గుండ్లకుంట శ్రీరాములు
- ఆళ్లగడ్డ- బారగొడ్ల హుస్సేన్
- శ్రీశైలం- అసర్ సయ్యద్ ఇస్మాయిల్
- బనగానపల్లె - గూటం పుల్లయ్య
- డోన్ - గారపాటి మధులెట్టి స్వామి
- ఆదోని - గొల్ల రమేశ్
- ఆలూరు - నవీన్ కిషోర్ ఆరకట్ల
- కల్యాణ్దుర్గం- పి. రాంభూపాల్ రెడ్డి
- ధర్మవరం- రంగాన అశ్వర్థ నారాయణ
10 స్థానాల్లో అభ్యర్థులు మార్పు
- శ్రీకాకుళం - అంబటి కృష్ణారావు (పాడి నాగభూషణరావు స్థానంలో)
- గజపతినగరం- దోలా శ్రీనివాస్ (కురిమినాయుడు స్థానంలో)
- తాడికొండ (ఎస్సీ) - మణిచల సుశీల్ రాజా (చిలకా విజయ్ కుమార్ స్థానంలో)
- ఒంగోలు - తుర్లపాక నాగలక్ష్మీ (బుట్టి రమేశ్బాబు స్థానంలో)
- కోవూరు - నారపరెడ్డి కిరణ్కుమార్రెడ్డి (నెబ్రంబాకం మోహన్ స్థానంలో)
- సర్వేపల్లి - పి.వి. శ్రీకాంత్రెడ్డి (పూల చంద్రశేఖర్ స్థానంలో)
- గూడురు (ఎస్సీ) డాక్టర్. యు రామకృష్ణారావు (వేమయ్య చిలుకూరి స్థానంలో)
- సూళ్లూరుపేట(ఎస్సీ- చందనమూడి శివ (గడి తిలక్బాబు స్థానంలో)
- హిందూపురం - మహ్మద్ హుస్సేన్ ఇనయతుల్లా (వి నాగరాజు స్థానంలో)
- కనిగిరి - దేవరపల్లి సుబ్బారెడ్డి (కదిరి భవానీ)
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో 5 లోక్సభ, 114 అసెంబ్లీ నియోజవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా రెండో జాబితాలో 6 ఎంపీ, 12 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రస్తుతం విడుదల చేసిన జాబితాతో కలిపి మొత్తం 164 అసెంబ్లీ అభ్యర్థులు, 11 ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇంకా 11 ఎమ్మెల్యే, 14 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ పెండింగ్లో పెట్టింది.
కాంగ్రెస్ తొలి జాబితాలో ప్రకటించిన అభ్యర్థులు వీరే: