Prathidhwani : ప్రపంచం ఆసక్తి, ఉత్కంఠగా గమనిస్తున్న వేళ యుద్ధభూమి ఉక్రెయిన్లో అడుగు పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ. చిరకాల మిత్రదేశం రష్యా పర్యటన ముగిసిన సరిగ్గా ఆరు వారాలకే ఆ దేశంతో భీకరయుద్ధంలో ఉన్న కీవ్లో మోదీ దౌత్య యాత్ర సహజంగానే దృష్టినీ ఆకర్షిస్తోంది. మరి మాస్కోతో ఉన్న మైత్రీబంధాన్ని, ఇటు నాటో కూటమికి మధ్య ప్రాధాన్యతల్ని ఇప్పుడెలా సమన్వయం చేసుకోనున్నారు? అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గకుండా భారత్ ఇంతకాలంగా అనుసరిస్తోన్న తటస్థ వైఖరిని నిపుణులు ఎలా విశ్లేషిస్తున్నారు? వీటన్నింటికంటే పెద్ద ప్రశ్న ప్రధాని మోదీ ఇప్పుడే అక్కడికి ఎందుకు వెళ్లారు? రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న ఎదురుచూపులకు మోదీ పర్యటన రూపంలో ఏమైనా సానుకూల సంకేతాలు వచ్చే అవకాశం ఉందా? ఇదీ నేటి ప్రతిధ్వని.
చర్చలో పాల్గొంటున్న వారు ఉక్రెయిన్లో భారత మాజీ రాయబారి టి. సురేష్. ఈయన భారతవిదేశాంగ శాఖలో సుదీర్ఘకాలం పని చేశారు. నాటి సోవియట్ యూనియన్లోని పలుదేశాల్లో భారత రాయబారిగా సేవలందించారు. అయిదుగురు భారత ప్రధానమంత్రులు, రష్యా అధ్యక్షులకు మధ్య అనువాదకులుగా పని చేశారు. మరొకరు విశ్రాంత సైనికాధికారి మేజర్ జనరల్ కందుకూరి ఉమామహేశ్వర్. ఈయన సియెర్రాలియోన్ లో యునైటెడ్ నేషన్స్ మిలటరీ ఆపరేషన్స్ అబ్జర్వర్ గా పనిచేశారు. సైనిక, అంతర్జాతీయ అంశాల్లో నిపుణులు.
'మణిపుర్ వెళ్లని ప్రధాని, ఉక్రెయిన్ అధ్యక్షుడిని కౌగిలించుకున్నారు'- మోదీపై కాంగ్రెస్ ఫైర్