తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 8:34 AM IST

ETV Bharat / health

కాన్పు తర్వాత పథ్యం పాటించాలా? బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

After Delivery Food For Mother : బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బాలింతల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. వారికి శారీరకంగా, మానసికంగా అలసట అనిపిస్తుంటుంది. అయితే చాలామంది ప్రసవంతో అంతా ముగిసిందని అనుకుంటారు. కానీ బాలింతలు బిడ్డ ఆరోగ్యం కోసం అనేక నియమాలను పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Etv Bharat
Etv Bharat

After Delivery Food For Mother : బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బాలింతల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. అయితే బిడ్డకు జన్మనిచ్చిన దగ్గర నుంచి తల్లులు అనేక నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే తల్లికి ఏ చిన్న అసౌకర్యం ఉన్నా అది పిల్లలపై ప్రభావితం చేస్తుంది. అందుకే బాలింతల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. బాలింతలు సరైన ఆహారం తీసుకుంటేనే బిడ్డకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ప్రసవం అనంతరం ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం.

ప్రసవం తర్వాత వెంటనే చేయాల్సినవి
బిడ్డను ప్రసవించిన గంటలోపే శిశువుకు తల్లి పాలు పట్టించాలని వైద్యులు చెబుతున్నారు. అలాగే తల్లి డీహైడ్రేట్​ అవ్వకుండా వైద్యుల సలహాతో ఫ్లూయిడ్స్, లిక్విడ్స్ లాంటివి ఇవ్వాలి. బిడ్డకు జన్మనివ్వడానికి తల్లి ఏ పద్ధతిని అవలంబించింజమనేది ముఖ్యం. సాధారణ ప్రసవం జరిగిందా, ఫోర్ సెప్స్ లేదా సిజేరియన్ జరిగిందా అనే వాటి ప్రకారం తల్లికి ఆహారం ఎప్పుడు ఇవ్వాలనేది తెలుస్తుంది. సాధారణ ప్రసవం తర్వాత చాలా వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఫోర్ సెప్స్​లో మాత్రం కాస్త ఇబ్బంది ఉంటే, సిజేరియన్ జరిగితే మాత్రం ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. ప్రసవం సమయంలో ఎక్కువ రక్తం పోవటం వల్ల నీరసంగా అయిపోతారు. అందుకే వెంటనే ఫ్లూయిడ్స్ ఇవ్వడం అవసరం. అలాగే సిజేరియన్ తర్వాత ఎక్కువ నొప్పి కలుగుతుంది. అందుకే వైద్యులు పెయిన్ కిల్లర్ లేదా ఆ తరహా ఇంజెక్షన్లు ఇస్తుంటారు.

ఆహారం విషయంలో జాగ్రత్త
ప్రసవం తర్వాత తల్లి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. బిడ్డకు తల్లి పాలిస్తుంది. అందుకే ఆహారం విషయంలో నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే అని వైద్యులు చెబుతున్నారు. తీసుకునే ఆహారంలో నాలుగింట మూడు వంతులు చపాతీ లేదా బ్రౌన్ రైస్ తీసుకోవాలని, అలానే ఒక వంతు పండ్లు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తుంటారు. కూరగాయలు ఎక్కువ తీసుకోవాలని సూచిస్తుంటారు. ఇలా పండ్లు, కూరగాయల వల్ల శరీరానికి ఎక్కువ మోతాదులో విటమిన్ ఎ, సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.

అసలు తినకూడనవి
ప్రసవం తర్వాత కొన్ని ఆహారాలకు తల్లులు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా చేపలు తినకూడదని హెచ్చరిస్తుంటారు. చేపలో మెర్క్యురీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బిడ్డకు హానికరమని వైద్యులు అంటున్నారు. అలాగే తల్లులు క్యాబేజీ, క్యాలీఫ్లవర్​లు తినకపోవడం ఉత్తమం అంటున్నారు. ఇవి తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎక్కువ మసాలాలు, కారం ఉండే ఆహారాల జోలికి వెళ్లకూడదు అని వైద్యులు సూచిస్తున్నారు.

ఇవి పాటించడం తప్పనిసరి
తల్లులు ఎక్కువ ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలి. పాలు, పన్నీర్, చీజ్ తీసుకోవడం మంచిది. ముఖ్యంగా శరీరానికి 8 నుంచి 10గంటల విశ్రాంతి అవసరం. సిజేరియన్ జరిగితే మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే కొన్ని రకాల యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్​కు దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తల్లిపాల ద్వారా కొన్నిరకాల హానికర రసాయనాలు పిల్లలకు చేరతాయని, అందుకే వాటిని వాడకూడదని అంటారు. అలాగే కాన్పు తర్వాత రెండు నెలల వరకు సంభోగంలో పాల్గొనకపోవడం ఉత్తమం అని వైద్యులు సలహా ఇస్తున్నారు.

హార్ట్ అటాక్ వచ్చినవారు ఎక్సర్​సైజ్​ చేయొచ్చా? వైద్యులేం చెబుతున్నారు ?

టీ మళ్లీ మళ్లీ వేడి చేసి తాగొచ్చా? కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉందా?

ABOUT THE AUTHOR

...view details