69 Filmfare Awards South 2024:69వ శోభ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ -2024 ఈవెంట్ శనివారం రాత్రి హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. టాలీవుడ్ స్టార్ హీరో సందీప్ కిషన్ ఈ ఈవెంట్కు హోస్ట్గా వ్యవహరించారు. సందీప్తోపాటు ఫరియా అబ్దుల్లా, వింద్య విశాఖ కూడా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో పలువురు
ఈ ఉత్సవంలో రాశీఖన్నా, అపర్ణ బాలమురళీ, సానియా ఇయాపాన్, గాయత్రీ భరద్వాజ్ ప్రదర్శనతోపాటు పలువురు హీరోయిన్లు ఉత్సాహంగా డ్యాన్స్లతో ఉర్రూతలూగించారు. నామినేషన్స్ జాబితాలో ఉన్న వారిలో విజేతలను ప్రకటిస్తున్న సమయంలో వేడుక మొత్తం విజిల్స్ చప్పట్లతో మార్మోగిపోయింది.
బలగం, దసరాకు అవార్డుల పంట:చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న 'బలగం' ఉత్తమ చిత్రంగా నిలవడమే కాకుండా, ఉత్తమ దర్శకుడిగా వేణు అవార్డు అందుకున్నారు. ఇక 'దసరా'లో నటనకుగానూ నాని, కీర్తి సురేష్ ఉత్తమ నటీనటులుగా ఎంపికయ్యారు. ఉత్తమ పరిచయ దర్శకుడి అవార్డును ఇద్దరు అందుకున్నారు. శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్ నాన్న) ఇద్దరి సినిమాల్లోనూ నాని కథానాయకుడిగా నటించడం మరో విశేషం. 'బేబీ' చిత్రానికి కూడా వివిధ విభాగాల్లో అవార్డులు లభించాయి.