Mamata Urges Junior Doctors :ఆర్జీ కర్ వైద్యురాలి హత్యాచార కేసులో న్యాయం చేయాలని, తమ డిమాండ్లు నెరవేర్చాలని జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరాహార దీక్షను విరమించుకోవాలని బంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. డిమాండ్లపై చర్చించేందుకు సోమవారం వారిని కలుస్తానని తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న డాక్టర్లను చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ కలిశారు. ఆ సమయంలో డాక్టర్లతో మమతా బెనర్జీ ఫోన్లో మాట్లాడారు. వైద్యులు తమ ముందుకు తెచ్చిన డిమాండ్లను ఇప్పటికే నెరవేర్చామని, మిగతా వాటి కోసం 3-4 నెలల సమయం ఇవ్వాలని మమత వైద్యులను కోరారు.
'రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి నారాయణ్ స్వరూప్ నిగమ్ను తొలగించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. నేను ఆరోగ్య కార్యదర్శని ఎందుకు తొలగించలేదో మీకు తెలుసు. ఒక విభాగంలో అందరనీ ఒకేసారి తొలగించడం సాధ్యం కాదు. ఇప్పటికే డీహెచ్ఎస్, డీఎమ్ఈలను తొలగించాం. దయచేసి మళ్లీ విధుల్లో చేరండి. అసలు ఏ అధికారని తొలగించాలో లేదో మీరు ఎలా నిర్ణయించగలరు? మీ డిమాండ్లలో కొన్నింటికి విధానపరమైన నిర్ణయాలు అవసం. అందకు మేం పూర్తి స్థాయిలో సహకరిస్తాం. కామీ ఏమి చేయాలో మీరు ప్రభుత్వానికి నిర్దేశించడం ఆమోదయోగ్యం కాదు' అని మమతా బెనర్జీ అన్నారు.