తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నదిలో మునిగిపోతున్న వారిని కాపాడిన శ్రీశైల- కానీ ఆయన మాత్రం అందులోనే ప్రాణాలు విడిచి! - Man Drowned In River Karnataka - MAN DROWNED IN RIVER KARNATAKA

Man Drowned In River Karnataka : నదిలో కొట్టుకుపోతున్న ఇద్దరి వ్యక్తులను కాపాడిన వ్యక్తి అదే నీటిలో మునిగి చనిపోయారు. తింటున్న భోజనాన్ని కూడా సగంలో వదిలేసి మరీ సాయం చేసేందుకు వెళ్లారు. కానీ ప్రమాదవశాత్తు మరణించారు. కర్ణాటకలో జరిగిందీ ఘటన.

Man Drowned In River Karnataka
Man Drowned In River Karnataka

By ETV Bharat Telugu Team

Published : Apr 17, 2024, 10:15 AM IST

Updated : Apr 17, 2024, 10:23 AM IST

Man Drowned In River Karnataka : నదిలో కొట్టుకుపోతున్న ఇద్దరినీ కాపాడారో వ్యక్తి. కానీ ఆయన మాత్రం ఒడ్డుకు చేరలేక తిరిగి అదే నీటిలో మునిగి మరణించారు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావిలోని మలప్రభ నదిలో జరిగింది.
రామదుర్గ తాలూకా అవరాది గ్రామానికి చెందిన శ్రీశైల(47) ఆదివారం పెళ్లికి ముందు రోజు జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. భోజనం చేస్తుండగా మలప్రభ నదిలో ఇద్దరు వ్యక్తులు గల్లంతైనట్లు ఆయనకు తెలిసింది. దీంతో శ్రీశైల భోజనాన్ని మధ్యలోనే వదిలేసి నది వద్దకు వెళ్లారు.

నదిలోకి దూకి నీటిలో మునిగిపోతున్న ఇద్దరినీ రక్షించారు శ్రీశైల. కానీ ఆయన మాత్రం ఒడ్డుకు రాలేకోపోయారు. అదే నీటిలో మునిగి మృతి చెందారు. అయితే శ్రీశైల వ్యవసాయం చేసుకుంటూ తన తల్లితో కలిసి జీవిస్తున్నాడు. ఈ విషయంపై శ్రీశైల సోదరుడు నాగరాజు మాట్లాడాడు. 'ఆదివారం నదిలో ఈతకు వెళ్లిన ఓ బాలుడు నీటిలో మునిగిపోతున్నాడు. అతడిని రక్షించేందుకు వెళ్లిన యువకుడు కూడా నీటిలో మునిగిపోతున్నాడు. వారిద్దరినీ మా అన్న ఒడ్డుకు చేర్చారు. శ్రీశైల మాత్రమే తిరిగి రాలేదు. నదిలో ఎవరో మునిగిపోతున్నారని తెలియగానే సాయం చేసేందుకు పరుగులు వెంటనే తీశారు. గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా ముందుకొచ్చి సేవ చేసేవారు' అని నాగరాజు తెలిపారు.

112ఏళ్ల క్రితం 'టైటానిక్' ప్రమాదంలో మృతి- ఆమె పేరుతో భారత్​లో ఇప్పటికీ విద్యా 'దానం'!
Titanic Disaster Miss Annie Story : భారత్​లో బాలికల విద్య కోసం కృషి చేసిన ఓ విదేశీ మహిళ టైటానిక్​ ప్రమాదంలో చనిపోయారు. చావు ఎదురుగా ఉన్నా కూడా తన లైఫ్​ జాకెట్​ను ఓ చిన్నారికి ఇచ్చి ప్రాణ త్యాగం చేశారు. ఆమె చనిపోయి వందేళ్లు దాటిపోయినా ఇంకా చత్తీస్​గఢ్ ప్రజలు ఆ మహిళ సేవలను ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారు. మిస్​ అన్నీ క్లెమెర్ ఫంక్. టైటానిక్​ ఓడ సముద్రంలో మునిగి పోయి 112ఏళ్లు గడిచాయి. ఇంతకీ ఆ విదేశీ మహిళ ఎవరు? భారత్​లో ఆమె చేసిన సేవలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

నాగ్​పుర్​లో టప్ ఫైట్!​- భారీ మెజారిటీతో గడ్కరీ హ్యాట్రిక్ కొడతారా? - Nitin Gadkari Nagpur

భారీ ఎన్​కౌంటర్-​ 29 మంది మావోయిస్టులు హతం - chhattisgarh encounter today

Last Updated : Apr 17, 2024, 10:23 AM IST

ABOUT THE AUTHOR

...view details