తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Apr 13, 2024, 10:35 AM IST

Updated : Apr 13, 2024, 2:23 PM IST

ETV Bharat / bharat

బోరుబావిలో పడ్డ ఆరేళ్ల బాలుడు- అధికారులు అలర్ట్-​ రెస్క్యూ టీమ్​ ఇంటెన్స్​ ఆపరేషన్ - Boy Fell In Borewell In MP

Boy Fell In Borewell In MP : ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిన ఆరేళ్ల బాలుడిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బాలుడు 40 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. మధ్యప్రదేశ్‌ రీవా జిల్లాలో జరిగిందీ ఘటన.

Boy Fell In Borewell In MP Rewa District
Boy Fell In Borewell In MP Rewa District

Boy Fell In Borewell In MP : మధ్యప్రదేశ్‌ రీవా జిల్లాలోని మనికా గ్రామంలో ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిన ఆరేళ్ల బాలుడిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బాలుడు 40 అడుగుల లోతులో ఉన్నట్లు ఎస్​డీఈఆర్​ఎఫ్​ సిబ్బంది గుర్తించారు. కాగా, చిన్నారి పడ్డ బావి 70 అడుగుల లోతు ఉన్నట్లు తెలుస్తోంది.

చిన్నారి జారిపడ్డ బోరుబావి ఇదే.

బాలుడికి పైపుల సాయంతో ఆక్సిజన్ అందేలా అధికారులు చర్యలు చేపట్టారు. సీసీటీవీ కెమరాను లోపలికి పంపించేందుకు యత్నించినప్పటికీ మధ్యలోనే ఆగిపోయిందని తెలిపారు. వీలైనంత త్వరగా చిన్నారిని రక్షించేందుకు జేసీబీల సాయంతో బోరుబావి చుట్టూ సొరంగం తవ్వుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మనికా గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటుూ వెళ్లి ఓ బాలుడు బోరు బావిలో పడ్డాడు. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల సహాయక చర్యలు చేపట్టారు.

బోరుబావిలో ఉన్న బాలుడికి ఆక్సిజన్​ అందించేందుకు రెస్క్యూ సిబ్బంది యత్నం.

'సమాతరంగా సొరంగం తవ్వుతున్నాం'
'బోరుబావిలో పడిపోయిన చిన్నారిని కాపాడేందుకు జిల్లా యంత్రాంగం, ఎస్​డీఆర్​ఎఫ్​, ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. బాలుడు పడ్డ బోరుబావి లోతు 70 అడుగులు వరకు ఉంటుంది. 50 అడుగులు తవ్విన తర్వాత చిన్నారి 45-50 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. బాధిత బాలుడిని చేరుకునేందుకు వీలుగా ఉండేలా సమాంతరంగా సొరంగాన్ని తవ్వుతున్నాం. వైద్యుల బృందం కూడా ఘటనాస్థలి వద్ద ఉంది' అని రీవా జిల్లా కలెక్టర్​ ప్రతిభా పాల్​ తెలిపారు.

"జానేహ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని మానికా గ్రామంలో మయూర్​ అనే ఆరేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు తెరిచి ఉన్న బోరుబావిలో పడ్డాడు. కొందరు పిల్లలతో కలిసి అతడు శుక్రవారం మధ్యాహ్నం ఆడుకునేందుకు సమీపంలోని పొలానికి వెళ్లి ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న 70 అడుగులు లోతుగల బోర్​బావిలో పడిపోయాడు. వెంటనే స్థానికులు మాకు సమాచారం ఇచ్చారు. స్టేషన్​ ఇన్​ఛార్జి, ఎస్‌డీఎం, అధికారులతో పాటు పోలీసు బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి."
- అనిల్​ సోంకర్​, అడిషనల్​ ఎస్​పీ

సీఎం స్పందన
చిన్నారి బోరుబావిలో పడ్డ ఘటనపై సీఎం మోహన్​ యాదవ్​ స్పందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితులను పర్యవేక్షించాలని డిప్యూటీ సీఎం రాజేంద్ర శుక్లాను ఆదేశించారు. తాను కూడా సంబంధిత అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నానని చెప్పారు.

బోరుబావి చుట్టూ జేసీబీలతో తవ్వకాలు.

'బోరుబావిలో పడ్డ చిన్నారిని రక్షించేందుకు ఇరువైపులా 35 అడుగులు సొరంగం తవ్వారు. వీటి ద్వారా అతడిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్​ కోసం వారణాసి నుంచి ప్రత్యేకంగా ఎన్​డీఆర్​ఎఫ్​ దళాన్ని రప్పించాం. మరోవైపు రాష్ట్రంలో అకాల వర్షాలు రెస్క్యూ ఆపరేషన్‌కు విఘాతం కలిగిస్తున్నాయి' అని ముఖ్యమంత్రి తెలిపారు.

కర్ణాటక లోక్​సభ బరిలో 21మంది మహిళలు- జాతీయ పార్టీల తరఫున 8మంది పోటీ- నారీ శక్తి చూపుతారా? - Woman In Karnataka LS Polls 2024

ట్రయల్​కోర్టు తీర్పును కొట్టేసిన హైకోర్టు- తప్పుబట్టిన సుప్రీం- సరైన కారణం లేనిదే రద్దు చేయరాదని క్లారిటీ - SC SERIOUS ON GUJARAT High Court

Last Updated : Apr 13, 2024, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details