thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 12, 2023, 7:10 PM IST

ETV Bharat / Videos

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హమీల అమలు దిశగా పోరాటం చేద్దాం : హరీశ్‌రావు

BRS MLA Harish Rao Success Meet in Sangareddy : కాంగ్రెస్‌ పార్టీ చెప్పిన అబద్దాలను ప్రజలు నమ్మి అధికారం ఇచ్చారనీ, ప్రజలు ఇచ్చిన తీర్పునకు తాము కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తమకంటే మిన్నగా పని చేయాలని కోరుకుందామని కార్యకర్తలకు సూచించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 10 స్థానాలకుగానూ 7 సీట్లు కైవశం చేసుకున్నందుకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. సభకు హజరైన హరీశ్‌రావు కార్యకర్తలకు భరోసా కల్పించారు.

ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఏడు మంది ఎమ్మెల్యేలు కలసికట్టుగా పని చేసి సమస్యల పరిష్కారానికి పోరాడతామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హమీలు అమలు దిశగా తమ పోరాటం ఉంటుందన్నారు. తమ ప్రభుత్వం కంటే ఇప్పటి ప్రభుత్వం మంచిగా ప్రజలకు సేవచేయాలని ఆకాంక్షించారు. గెలిచిన ప్రతి ఎమ్మెల్యే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.