యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం గంగాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చీనురి రాహుల్ స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటమునిగి ఎంతకు బయటకు రాకపోయే సరికి స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. హుటాహుటినా గ్రామస్థులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకొన్న గ్రామస్థులు కరెంట్ మోటర్ల సాయంతో బావిలోని నీటినంతా తోడి మృతదేహాన్ని బయటకు తీశారు. ఎదిగి వచ్చిన కుమారుడు విగతజీవిగా మారటం వల్ల కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్ష నిమిత్తం ఆలేరు ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.