ETV Bharat / state

'భాజపా కార్యాలయ పునాది రాళ్లు.. తెరాసకు సమాధిరాళ్లు' - latest news on bjp laxman

జనవరి 1 నుంచి తెరాస ప్రభుత్వ వైఫల్యాలపై వీధి పోరాటాలు చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్​ పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతనంగా నిర్మించనున్న పార్టీ కార్యాలయ భూమి పూజకు ఆయన హాజరయ్యారు.

The foundation stones of the bhajapa office The graves of Terasa
'భాజపా కార్యాలయ పునాది రాళ్లు.. తెరాసకు సమాధిరాళ్లు'
author img

By

Published : Dec 2, 2019, 10:57 AM IST

ప్రజలు తెరాస పాలనతో విసిగిపోయి... భాజపా వైపు చూస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్​ పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని పట్టణ శివార్లలో నూతనంగా నిర్మించనున్న పార్టీ నూతన కార్యాలయం భూమి పూజకు ఆయన హాజరయ్యారు.

పార్టీ కార్యాలయాలు ప్రజా సమస్యలు తీర్చే నిలయాలుగా ఉంటాయని చెప్పుకొచ్చారు. భాజపా కార్యాలయ పునాది రాళ్లు.. సమీప రోజుల్లో తెరాస ప్రభుత్వానికి సమాధి రాళ్లవుతాయని లక్ష్మణ్​ ధ్వజమెత్తారు. జనవరి 1 నుంచి ప్రభుత్వ వైఫల్యాలపై వీధి పోరాటాలు చేస్తామన్నారు.

'భాజపా కార్యాలయ పునాది రాళ్లు.. తెరాసకు సమాధిరాళ్లు'

అనంతరం రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా... ప్రభుత్వం స్పందించడం లేదని లక్ష్మణ్​ మండిపడ్డారు. ఫ్రెండ్లీ పోలీసింగ్​ అంటే పరిధి పేరు చెప్పి కేసు స్వీకరించకపోవడమేనా అని ప్రశ్నించారు. శంషాబాద్​లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు.

ఇదీ చూడండి : 'నిర్భయ' దోషికి క్షమాభిక్ష వద్దు: దిల్లీ ప్రభుత్వం

ప్రజలు తెరాస పాలనతో విసిగిపోయి... భాజపా వైపు చూస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్​ పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని పట్టణ శివార్లలో నూతనంగా నిర్మించనున్న పార్టీ నూతన కార్యాలయం భూమి పూజకు ఆయన హాజరయ్యారు.

పార్టీ కార్యాలయాలు ప్రజా సమస్యలు తీర్చే నిలయాలుగా ఉంటాయని చెప్పుకొచ్చారు. భాజపా కార్యాలయ పునాది రాళ్లు.. సమీప రోజుల్లో తెరాస ప్రభుత్వానికి సమాధి రాళ్లవుతాయని లక్ష్మణ్​ ధ్వజమెత్తారు. జనవరి 1 నుంచి ప్రభుత్వ వైఫల్యాలపై వీధి పోరాటాలు చేస్తామన్నారు.

'భాజపా కార్యాలయ పునాది రాళ్లు.. తెరాసకు సమాధిరాళ్లు'

అనంతరం రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా... ప్రభుత్వం స్పందించడం లేదని లక్ష్మణ్​ మండిపడ్డారు. ఫ్రెండ్లీ పోలీసింగ్​ అంటే పరిధి పేరు చెప్పి కేసు స్వీకరించకపోవడమేనా అని ప్రశ్నించారు. శంషాబాద్​లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు.

ఇదీ చూడండి : 'నిర్భయ' దోషికి క్షమాభిక్ష వద్దు: దిల్లీ ప్రభుత్వం

Intro:TG_NLG_61_01_Bhoomipuja_AB_TS10061

యాంకర్: టీఆరెస్ పాలన లో ప్రజలు విసిగిపోయి బీజేపీ వైపు వస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా "లక్ష్మణ్ అన్నారు. ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివార్లలో బీజేపీ పార్టీ నూతన కార్యాలయం భూమి పూజకు హాజరైయ్యారు. పూజా కార్యక్రమం లో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా"లక్ష్మణ్ కు పట్టణ బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రియాంక రెడ్డి హత్య ,వరంగల్ లో మానస లు హత్యకు గురైతే ప్రభుత్వ స్పందన లేదని ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. ఫ్రెండ్లీ పోలీసులు అంటున్న పోలీసులు హత్యలు జరిగితే ఫిర్యాదు చేయడానికి వెళ్తే మా పరిధి కాదు అనడం ఇదేనా మీ ఫ్రెండ్లీ పోలీసులు అని ప్రశ్నించారు.
భూమి పూజ చేసిన అనంతరం లక్ష్మణ్ మీడియా తో మాట్లాడుతూ బీజేపీ కార్యాలయ పునాది రాళ్లు సమీప రోజుల్లో టీఆరెస్ ప్రభుత్వానికి సమాధులు అవుతాయి. రాష్ట్రంలో ప్రజలు టీఆరెస్ పాలనలో విసిగిపోయి బీజేపీ వైపు వస్తున్నారని, ఆర్టీసీ కార్మికుల కు మద్దతు ఇస్తారని ప్రభుత్వ ఉద్యోగులను పీఆర్సీ ఇవ్వకుండా మోసం చేశారన్నారు. బీజేపీ పార్టీ కార్యాలయం ప్రజా సమస్యలు తీర్చే నిలయాలుగా ఉంటాయని ప్రజలకు భరోసా ఇచ్చారు. జనవరి 1నుంచి టీఆరెస్ ప్రభుత్వ వైఫల్యం పై వీధి పోరాటలు చేస్తాం అని అన్నారు. స్థానిక సంస్థలను నిర్విర్యం చేసి కేంద్రం నిధులు దారి మళ్లించి కొత్త పేర్ల తో పథకాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రియాంక రెడ్డి హత్య పై ముఖ్యమంత్రి స్పందించక పోవడం సిగ్గుచేటని, రాష్ట్రంలో 60 పైగా అమ్మాయిల మిస్సింగ్ కేసులు నమోదు అయినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యం వహించగా వారిని సస్పెన్షన్ చేయటం కాదు విధుల నుంచి తొలగించాలి అని అన్నారు. ప్రియాంక రెడ్డి హత్య పై స్పందించాల్సిన మంత్రులు హేళన చేయడం సిగ్గుచేటు...తెలంగాణ రాష్ట్రం లో బడులు మూతపడ్డాయి. బార్ లు తెరుచుకున్నాయి. మద్యం ఏరులై పారుతున్నాయి. హైదరాబాద్ లో పబ్ కల్చర్, క్లబ్ కల్చర్ పెంచి అర్ధరాత్రి వరకు మద్యం షాపులు తెరచి యువకులను మద్యానికి బానిసలు అవుతున్నారని అన్నారు. బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ప్రసాదం అందచేశారు.

బైట్:- డా"లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుBody:రిపోర్టర్ : సతీష్ శ్రీపాద
సెంటర్ : భువనగిరి
జిల్లా : యాదాద్రి భువనగిరి
సెల్ : 8096621425

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.