ETV Bharat / state

హరిక్షేత్రంలో శివోహం.. పరమేశ్వరునికి కేసీఆర్ దంపతుల పూజలు

author img

By

Published : Apr 25, 2022, 1:48 PM IST

KCR at Yadadri Today : యాదాద్రిలో శివాలయ ఉద్ఘాటన మహాక్రతువు వైభవంగా జరుగుతోంది. లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అనుబంధ ఆలయమైన రామలింగేశ్వరస్వామి మహాకుంభాభిషేక మహోత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు, మంత్రులు పాల్గొన్నారు. ఆగమ శాస్త్ర రీత్యా ఆచారపర్వాలు 5 రోజులు కొనసాగుతుండగా... ఉద్ఘాటన పర్వాలు పూర్తయ్యాక.. పార్వతీపరమేశ్వరుల నిజరూప దర్శనాలకు అవకాశం కల్పిస్తారు.

KCR at Yadadri Today
KCR at Yadadri Today

శివాలయ ఉద్ఘాటన వైభవంలో కేసీఆర్ దంపతులు

KCR at Yadadri Today : మహాదివ్య హరిహరుల క్షేత్రం యాదాద్రిలో పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయం పునఃప్రారంభం కనుల పండువగా సాగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృఢ సంకల్పంతో లక్ష్మీనారసింహుడి ప్రధానాలయంతో పాటు అనుబంధ శివాలయ పునర్నిర్మాణాలు పూర్తయ్యాయి. గత నెల 28న పంచనారసింహుల సన్నిధిని మహాకుంభ సంప్రోక్షణతో ఉద్ఘాటన పర్వం నిర్వహించారు. అనుబంధంగా ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయ ఉద్ఘాటనలో భాగంగా... ఈ నెల 20 నుంచి మహాకుంభాభిషేక మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఈ ఆలయ ఉద్ఘాటన పర్వం సోమవారం నిర్వహించి నిజ దర్శనాలు కల్పించనున్నారు.

KCR at Yadadri Temple : ప్రధానాలయాన్ని పునఃనిర్మాణ సమయంలోనే.... ఈ శివాలయాన్ని ఎకరా స్థలంలో నిర్మించారు. ఆంజనేయస్వామి, నవగ్రహ,మరకత మండపాలు, రామాలయం, ఆలయం చుట్టూ ప్రాకారాలను నిర్మించారు. శివాలయంలో భాగంగానే ఆంజనేయస్వామి, గణపతి, పర్వతవర్ధినీ అమ్మవారి దేవాలయాలు, యాగశాలను నిర్మించారు. శివాలయ ముఖ మండపం ఎదురుగా ధ్వజ స్తంభానికి వెనుక వైపున ఆవరణలో ప్రత్యేక పీఠంపై నంది విగ్రహాన్ని ఏర్పాటు చేయగా... ఆలయ స్వాగత తోరణానికి శివపార్వతుల విగ్రహాలను అమర్చారు.

KCR at Shivalayam in Yadadri : శివాలయ ఉద్ఘాటన ఉత్సవాల్లో భాగంగా.... మహాకుంభాషేక ఉత్సవాలు కొనసాగుతుండగా... ధనిష్ఠా నక్షత్ర సుముహూర్తాన ఉద్ఘాటనకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే... ఉదయం నుంచి ద్వారతోరణపూజ స్థాపిత దేవతాయజన, ప్రాసాద దిక్‌స్థుండిల హోమాలు, వ్యాహృతి హోమాలు, శతకృత్వోభి మంత్రణం, దేవమస్తకాభిషేకం, గర్తన్యాసం నిర్వహించారు.

కేసీఆర్ దంపతుల పూజలు : శివాలయ ఉద్ఘాటన కోసం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా కేసీఆర్ యాదాద్రి చేరుకున్నారు. అక్కణ్నుంచి యాదగిరిగుట్ట ప్రెసిడెన్షియల్ సూట్‌కు వెళ్లారు. అనంతరం ఉద్ఘాట ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి పాల్గొని... ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సీఎం దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కేసీఆర్‌... అనంతరం శివాలయ మహాకుంభ సంప్రోక్షణ పాల్గొన్నారు.

రామలింగేశ్వరస్వామి ఆలయ ఉద్ఘాటనలో భాగంగా... రాంపురం పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి చేతుల మీదుగా స్ఫటిక లింగ ప్రతిష్ఠ, అష్టబంధం, ప్రాణప్రతిష్ఠ, కలశ ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహిస్తున్నారు. అనంతరం, మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకం, స్వామివారి అనుగ్రహ భాషణం, మహదాశీర్వచనం, తీర్థ ప్రసాద వితరణ, ప్రతిష్ఠా యాగ పరిసమాప్తిని పలుకనున్నారు.

భక్తుల పారవశ్యం : ఉద్ఘాటన పర్వాలు పూర్తయ్యాక.. పార్వతీపరమేశ్వరుల నిజరూప దర్శనాలకు భక్తులకు అవకాశం కల్పించనున్నారు. ప్రతిష్ఠ యాదాద్రీశుడి సన్నిధిలో ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తోన్న ఆలయ ప్రదర్శనలు.. ఒక్కొక్క కట్టడం చూసి భక్తులు పరవశించిపోతున్నారు.

ఇవీ చదవండి :

శివాలయ ఉద్ఘాటన వైభవంలో కేసీఆర్ దంపతులు

KCR at Yadadri Today : మహాదివ్య హరిహరుల క్షేత్రం యాదాద్రిలో పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయం పునఃప్రారంభం కనుల పండువగా సాగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృఢ సంకల్పంతో లక్ష్మీనారసింహుడి ప్రధానాలయంతో పాటు అనుబంధ శివాలయ పునర్నిర్మాణాలు పూర్తయ్యాయి. గత నెల 28న పంచనారసింహుల సన్నిధిని మహాకుంభ సంప్రోక్షణతో ఉద్ఘాటన పర్వం నిర్వహించారు. అనుబంధంగా ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయ ఉద్ఘాటనలో భాగంగా... ఈ నెల 20 నుంచి మహాకుంభాభిషేక మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఈ ఆలయ ఉద్ఘాటన పర్వం సోమవారం నిర్వహించి నిజ దర్శనాలు కల్పించనున్నారు.

KCR at Yadadri Temple : ప్రధానాలయాన్ని పునఃనిర్మాణ సమయంలోనే.... ఈ శివాలయాన్ని ఎకరా స్థలంలో నిర్మించారు. ఆంజనేయస్వామి, నవగ్రహ,మరకత మండపాలు, రామాలయం, ఆలయం చుట్టూ ప్రాకారాలను నిర్మించారు. శివాలయంలో భాగంగానే ఆంజనేయస్వామి, గణపతి, పర్వతవర్ధినీ అమ్మవారి దేవాలయాలు, యాగశాలను నిర్మించారు. శివాలయ ముఖ మండపం ఎదురుగా ధ్వజ స్తంభానికి వెనుక వైపున ఆవరణలో ప్రత్యేక పీఠంపై నంది విగ్రహాన్ని ఏర్పాటు చేయగా... ఆలయ స్వాగత తోరణానికి శివపార్వతుల విగ్రహాలను అమర్చారు.

KCR at Shivalayam in Yadadri : శివాలయ ఉద్ఘాటన ఉత్సవాల్లో భాగంగా.... మహాకుంభాషేక ఉత్సవాలు కొనసాగుతుండగా... ధనిష్ఠా నక్షత్ర సుముహూర్తాన ఉద్ఘాటనకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే... ఉదయం నుంచి ద్వారతోరణపూజ స్థాపిత దేవతాయజన, ప్రాసాద దిక్‌స్థుండిల హోమాలు, వ్యాహృతి హోమాలు, శతకృత్వోభి మంత్రణం, దేవమస్తకాభిషేకం, గర్తన్యాసం నిర్వహించారు.

కేసీఆర్ దంపతుల పూజలు : శివాలయ ఉద్ఘాటన కోసం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా కేసీఆర్ యాదాద్రి చేరుకున్నారు. అక్కణ్నుంచి యాదగిరిగుట్ట ప్రెసిడెన్షియల్ సూట్‌కు వెళ్లారు. అనంతరం ఉద్ఘాట ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి పాల్గొని... ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సీఎం దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కేసీఆర్‌... అనంతరం శివాలయ మహాకుంభ సంప్రోక్షణ పాల్గొన్నారు.

రామలింగేశ్వరస్వామి ఆలయ ఉద్ఘాటనలో భాగంగా... రాంపురం పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి చేతుల మీదుగా స్ఫటిక లింగ ప్రతిష్ఠ, అష్టబంధం, ప్రాణప్రతిష్ఠ, కలశ ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహిస్తున్నారు. అనంతరం, మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకం, స్వామివారి అనుగ్రహ భాషణం, మహదాశీర్వచనం, తీర్థ ప్రసాద వితరణ, ప్రతిష్ఠా యాగ పరిసమాప్తిని పలుకనున్నారు.

భక్తుల పారవశ్యం : ఉద్ఘాటన పర్వాలు పూర్తయ్యాక.. పార్వతీపరమేశ్వరుల నిజరూప దర్శనాలకు భక్తులకు అవకాశం కల్పించనున్నారు. ప్రతిష్ఠ యాదాద్రీశుడి సన్నిధిలో ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తోన్న ఆలయ ప్రదర్శనలు.. ఒక్కొక్క కట్టడం చూసి భక్తులు పరవశించిపోతున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.