ETV Bharat / state

'ఒక్కో బాధిత కుటుంబానికి 25 వేల రూపాయలు'

పైశాచిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను సీపీ మహేశ్ భగవత్ తన కార్యాలయంలో పరామర్శించారు. అనంతరం వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకుని ఆర్థికసాయం అందజేశారు.

author img

By

Published : May 4, 2019, 9:35 PM IST

ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే 100 నెంబర్​కు ఫోన్ చెయ్యండి : సీపీ

హాజీపూర్ బాధిత కుటుంబాలకు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆర్థిక సాయం అందించారు. మనీషా, కల్పన కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 వేల రూపాయల చెక్కును అందజేశారు. నేరేడ్ మెట్​లోని రాచకొండ కమిషనర్ కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు మహేశ్ భగవత్. కుటుంబంలో అర్హులైన వారికి పొరుగుసేవల ద్వారా ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
గత నెల 27న హాజీపూర్ గ్రామాన్ని సందర్శించి మరో బాధితురాలు శ్రావణి కుటుంబ సభ్యులకు 25 వేల రూపాయల ఆర్థికసాయం అందించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు... రహదారి సౌకర్యం కల్పిస్తామని మహేశ్ భగవత్ హామీ ఇచ్చారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే 100 నెంబర్​కు ఫోన్ చేసి పోలీసుల దృష్టికి తీసుకురావాలని సీపీ గ్రామస్థులకు సూచించారు.

MAHESH BHAGAVATH
హాజీపూర్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మహేశ్ భగవత్

ఇవీ చూడండి : సీపీఐ రాజ్​భవన్​ ముట్టడి ఉద్రిక్తం

హాజీపూర్ బాధిత కుటుంబాలకు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆర్థిక సాయం అందించారు. మనీషా, కల్పన కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 వేల రూపాయల చెక్కును అందజేశారు. నేరేడ్ మెట్​లోని రాచకొండ కమిషనర్ కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు మహేశ్ భగవత్. కుటుంబంలో అర్హులైన వారికి పొరుగుసేవల ద్వారా ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
గత నెల 27న హాజీపూర్ గ్రామాన్ని సందర్శించి మరో బాధితురాలు శ్రావణి కుటుంబ సభ్యులకు 25 వేల రూపాయల ఆర్థికసాయం అందించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు... రహదారి సౌకర్యం కల్పిస్తామని మహేశ్ భగవత్ హామీ ఇచ్చారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే 100 నెంబర్​కు ఫోన్ చేసి పోలీసుల దృష్టికి తీసుకురావాలని సీపీ గ్రామస్థులకు సూచించారు.

MAHESH BHAGAVATH
హాజీపూర్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మహేశ్ భగవత్

ఇవీ చూడండి : సీపీఐ రాజ్​భవన్​ ముట్టడి ఉద్రిక్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.