ETV Bharat / state

శ్రీనివాస్‌ రెడ్డికి మరణదండన విధించిన కోర్టు

సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసుల్లో మానవ మృగానికి న్యాయస్థానం మరణదండన విధించింది. ముగ్గురు బాలికలపై పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో మర్రి శ్రీనివాస్‌రెడ్డిని నల్గొండలోని పోక్సో కోర్టు... దోషిగా నిర్ధారించింది.

author img

By

Published : Feb 6, 2020, 11:20 PM IST

nalgonda court death sentenced to hajipur murder offender srinivas reddy
శ్రీనివాస్‌ రెడ్డికి మరణదండన విధించిన కోర్టు

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌ హత్యల కేసులో దోషి శ్రీనివాస్‌ రెడ్డికి ఉరి శిక్ష విధిస్తూ నల్గొండ పోక్సో న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. మరో కేసులో జీవితఖైదు విధించింది. కేసు నంబర్‌ 109, 110 కేసుల్లో ఉరిశిక్ష విధించిన కోర్టు.. కేసు నంబర్‌ 111లో జీవితఖైదు విధించింది.

నేరం నిరూపితమైందన్న న్యాయమూర్తి ఎస్‌.వి.వి.నాథ్‌ రెడ్డి... మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. డిసెంబర్ 28తో పాటు ఈ నెల 6, 7, 8 తేదీల్లో వాదనలు విన్న న్యాయస్థానం 101 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసింది.

శ్రీనివాస్​ రెడ్డి ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి చంపివేసి బావిలో పూడ్చిపెట్టిన ఘటన గతేడాది ఏప్రిల్‌లో వెలుగులోకి వచ్చింది.

శ్రీనివాస్‌ రెడ్డికి మరణదండన విధించిన కోర్టు

ఇవీ చూడండి: హాజీపూర్​ కేసులో న్యాయం జరిగింది: పికెట్​ పోలీసులు

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌ హత్యల కేసులో దోషి శ్రీనివాస్‌ రెడ్డికి ఉరి శిక్ష విధిస్తూ నల్గొండ పోక్సో న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. మరో కేసులో జీవితఖైదు విధించింది. కేసు నంబర్‌ 109, 110 కేసుల్లో ఉరిశిక్ష విధించిన కోర్టు.. కేసు నంబర్‌ 111లో జీవితఖైదు విధించింది.

నేరం నిరూపితమైందన్న న్యాయమూర్తి ఎస్‌.వి.వి.నాథ్‌ రెడ్డి... మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. డిసెంబర్ 28తో పాటు ఈ నెల 6, 7, 8 తేదీల్లో వాదనలు విన్న న్యాయస్థానం 101 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసింది.

శ్రీనివాస్​ రెడ్డి ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి చంపివేసి బావిలో పూడ్చిపెట్టిన ఘటన గతేడాది ఏప్రిల్‌లో వెలుగులోకి వచ్చింది.

శ్రీనివాస్‌ రెడ్డికి మరణదండన విధించిన కోర్టు

ఇవీ చూడండి: హాజీపూర్​ కేసులో న్యాయం జరిగింది: పికెట్​ పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.