ETV Bharat / state

'నియంత్రిత సాగు'తో విప్లవాత్మక మార్పులు - తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి

వరి పండించే రైతులు అధిక శాతం సన్న రకాలను మాత్రమే పండించాలని తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి సూచించారు. మూస పద్దతిలో అందరు ఒకే రకమైన పంటలను కాకుండా పంటమార్పిడి పద్దతులను పాటించాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నియంత్రిత పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

Farmers Awareness Seminar on Controlled Cultivation In Motkur
'నియంత్రిత సాగు'తో విప్లవాత్మక మార్పులు
author img

By

Published : May 29, 2020, 3:13 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ అధికారి స్వప్న ఆధ్వర్యంలో నియంత్రిత పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం నియంత్రిత పంటల సాగు కార్యాచరణ జరుగుతోందని ప్రతి రైతు ఈ సూచనలు పాటించాలని కోరారు.

సన్న రకం వరి పండించాలి

ఇందులో భాగంగా వరి పండించే రైతులు అధిక శాతం సన్న రకాలను మాత్రమే పండించాలని, మూస పద్దతిలో అందరు ఒకే రకమైన పంటలను కాకుండా పంటమార్పిడి పద్దతులను పాటించాలని కృష్ణారెడ్డి కోరారు. ఈ విధానం వల్ల అధిక దిగుబడితో పాటు భూ సారాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందని అన్నారు. రైతులు వారికి వారే స్వతహాగా భూములు ఏ పంటలకు అనుకూలమో వాటినే పండించాలని పేర్కొన్నారు. కేవలం నియంత్రిత సాగు ద్వారానే రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని స్పష్టం చేశారు. ప్రతి రైతు పండించే పంట వివరాలు మండల వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర నమోదు చేసుకోవాలని వెల్లడించారు.

ఇదీ చూడండి: ఆసిఫాబాద్​లో నకిలీ అధికారుల హల్​చల్​

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ అధికారి స్వప్న ఆధ్వర్యంలో నియంత్రిత పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం నియంత్రిత పంటల సాగు కార్యాచరణ జరుగుతోందని ప్రతి రైతు ఈ సూచనలు పాటించాలని కోరారు.

సన్న రకం వరి పండించాలి

ఇందులో భాగంగా వరి పండించే రైతులు అధిక శాతం సన్న రకాలను మాత్రమే పండించాలని, మూస పద్దతిలో అందరు ఒకే రకమైన పంటలను కాకుండా పంటమార్పిడి పద్దతులను పాటించాలని కృష్ణారెడ్డి కోరారు. ఈ విధానం వల్ల అధిక దిగుబడితో పాటు భూ సారాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందని అన్నారు. రైతులు వారికి వారే స్వతహాగా భూములు ఏ పంటలకు అనుకూలమో వాటినే పండించాలని పేర్కొన్నారు. కేవలం నియంత్రిత సాగు ద్వారానే రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని స్పష్టం చేశారు. ప్రతి రైతు పండించే పంట వివరాలు మండల వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర నమోదు చేసుకోవాలని వెల్లడించారు.

ఇదీ చూడండి: ఆసిఫాబాద్​లో నకిలీ అధికారుల హల్​చల్​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.