ETV Bharat / state

యాదాద్రిలో చురుగ్గా సాగుతున్న అభివృద్ధి పనులు

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా సుమారు 3 కోట్లతో స్వామి వారి మెట్ల నిర్మాణం తిరుమల తరహాలో చేపడుతున్నారు. అభివృద్ధిలో భాగంగా దర్శన వరుసల్లో ఇత్తడి పైకప్పు నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి.

author img

By

Published : Apr 16, 2021, 10:24 AM IST

development-works-in-yadadri-temple
యాదాద్రిలో చురుగ్గా సాగుతున్న అభివృద్ధి పనులు

యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఇత్తడి దర్శన వరుసలపై పైకప్పు పనులు చురుగ్గా సాగుతున్నాయి. దర్శన వరుసల సముదాయం నుంచి ప్రధాన ఆలయం మధ్య దూరం సుమారు రెండు వందల మీటర్ల వరకు ఉంటుంది. స్వామి దర్శనం కోసం యాత్రికులు వరుసల్లో నిల్చున్న సమయంలో ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు ఇత్తడి దర్శన వరుసలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

development-works-in-yadadri-temple
యాదాద్రిలో చురుగ్గా సాగుతున్న అభివృద్ధి పనులు

ప్రధానాలయ గోపురాలపై ఏర్పాటు చేసే 10 రాగి కలశాలు ఆలయానికి చేరాయి. ఆలయ పున‌ః ప్రారంభం సమయంలో సంప్రోక్షణ చేసి రాజ గోపురాలపై ప్రతిష్ఠిస్తామని అధికారులు వెల్లడించారు. అప్పటి వరకు వీటిని దేవస్థానంలోని స్ట్రాంగ్ రూమ్​లో భద్రపరుస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: బుల్లితెరపై రాణించి వెండితెరపై అదరగొట్టి!

యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఇత్తడి దర్శన వరుసలపై పైకప్పు పనులు చురుగ్గా సాగుతున్నాయి. దర్శన వరుసల సముదాయం నుంచి ప్రధాన ఆలయం మధ్య దూరం సుమారు రెండు వందల మీటర్ల వరకు ఉంటుంది. స్వామి దర్శనం కోసం యాత్రికులు వరుసల్లో నిల్చున్న సమయంలో ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు ఇత్తడి దర్శన వరుసలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

development-works-in-yadadri-temple
యాదాద్రిలో చురుగ్గా సాగుతున్న అభివృద్ధి పనులు

ప్రధానాలయ గోపురాలపై ఏర్పాటు చేసే 10 రాగి కలశాలు ఆలయానికి చేరాయి. ఆలయ పున‌ః ప్రారంభం సమయంలో సంప్రోక్షణ చేసి రాజ గోపురాలపై ప్రతిష్ఠిస్తామని అధికారులు వెల్లడించారు. అప్పటి వరకు వీటిని దేవస్థానంలోని స్ట్రాంగ్ రూమ్​లో భద్రపరుస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: బుల్లితెరపై రాణించి వెండితెరపై అదరగొట్టి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.