యాదాద్రి భువనగిరి జిల్లా సమస్తాన్ నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలో డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. 120 మంది పోలీసుల బృందంతో చేపట్టిన సోదాల్లో సరైన ధ్రువపత్రాలు లేని 43 ద్విచక్రవాహనాలు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మూడు బెల్ట్ షాపులను గుర్తించి.. వాటిని సీజ్ చేశారు.
హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలను నడపరాదని డీసీపీ నారాయణరెడ్డి సూచించారు. శిరస్త్రానం ధరించడం ద్వారా ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని డీసీపీ తెలిపారు.
ఇదీ చదవండి: ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్